AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు జట్లగా విడిపోయిన టీమిండియా.. ఎందుకంటే?

Indian Cricket Team: రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఓకేసారి రెండు జట్లను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు దాదాపు 30 నుంచి 35 మంది ఆటగాళ్లో రెండు టీంలను తయారు చేయాలని రంగం సిద్ధం చేస్తోంది.

Team India: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు జట్లగా విడిపోయిన టీమిండియా.. ఎందుకంటే?
Teamindia
Venkata Chari
|

Updated on: Apr 20, 2026 | 6:08 PM

Share

Indian Cricket Team: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. పెరుగుతున్న సిరీస్‌ల రద్దీ, యువ ఆటగాళ్లలో ఉన్న అపారమైన ప్రతిభను గుర్తించిన బోర్డు, ఒకే సమయంలో రెండు వేర్వేరు జట్లను అంతర్జాతీయ వేదికలపై బరిలోకి దింపేలా భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది భారత క్రికెట్ భవిష్యత్తును మార్చే కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఒకేసారి రెండు అంతర్జాతీయ జట్లు..

భారత జట్టులో చోటు కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ద్వారా ప్రతిభావంతులైన ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. వీరందరికీ అవకాశం కల్పించడం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ షెడ్యూల్స్‌ను దృష్టిలో ఉంచుకుని కనీసం 30 నుంచి 35 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన భారీ జాబితాను సిద్ధం చేయాలని బోర్డు నిర్ణయించింది. దీని ద్వారా ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాలతో సిరీస్‌లు ఆడే అవకాశం ఉంటుంది.

ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్..

ప్రస్తుత సమాచారం ప్రకారం, రాబోయే ఆసియా క్రీడలు, వెస్టిండీస్ పర్యటన దాదాపు ఒకే సమయంలో వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు వేర్వేరు సిరీస్‌ల కోసం రెండు పటిష్టమైన జట్లను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించడమే కాకుండా, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందే గొప్ప అవకాశం లభిస్తుంది.

శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ నాయకత్వం..?

రెండో జట్టు బాధ్యతలను భుజాన వేసుకునేందుకు శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును నడిపిస్తూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్, సారథిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ లేదా ఇతర అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మరో జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ప్రధాన జట్టు ఒక సిరీస్ ఆడుతుండగా, రెండో జట్టు మరో దేశంతో పోటీ పడుతుంది.

యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం..

ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులకు ఈ ప్రణాళిక వరంగా మారనుంది. ఐర్లాండ్, జింబాబ్వే వంటి దేశాలతో జరిగే పర్యటనలకు ఈ రెండో జట్టును పంపడం ద్వారా భారత బెంచ్ బలాన్ని పెంచాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లు కూడా సమానంగా బలంగా ఉండాలని బోర్డు కసరత్తు చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us