Asia Cup 2023: పీసీబీకి షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఆసియా కప్‌ నుంచి పాకిస్తాన్ ఔట్.. 5 దేశాలతోనే టోర్నీ?

India vs Pakistan: ఆసియా కప్ 2023కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కాలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం జరగాల్సిన ఆసియా కప్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రద్దు చేయాలని భావిస్తున్నందున, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు దేశాల మధ్య టోర్నమెంట్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Asia Cup 2023: పీసీబీకి షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఆసియా కప్‌ నుంచి పాకిస్తాన్ ఔట్.. 5 దేశాలతోనే టోర్నీ?
Ind Vs Pak
Follow us

|

Updated on: May 02, 2023 | 5:26 PM

ఆసియా కప్ 2023కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కాలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం జరగాల్సిన ఆసియా కప్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రద్దు చేయాలని భావిస్తున్నందున, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు దేశాల మధ్య టోర్నమెంట్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. టోర్నీకి ఆతిథ్యమివ్వాలనే తన వైఖరిని ఆ దేశం నిలబెట్టుకుంది.

2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ గతేడాది అక్టోబర్‌లో ప్రకటించింది. దీనితో పాటు, టోర్నమెంట్‌ను ఏదైనా తటస్థ వేదికకు మార్చనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అంతకుముందు 2018లో ఆసియా కప్‌ను భారతదేశం నిర్వహించింది. అయితే కొన్ని కారణాల వల్ల టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహించారు.

హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించిన పాకిస్థాన్?

ఆసియా కప్ 2023 కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను ఆఫర్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని ఇతర జట్లు తమ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో ఆడతాయని, భారత జట్టు వేరే దేశంలో ఆడుతుందని పాకిస్తాన్ క్రికెట్ ఈ మోడల్‌లో తెలిపింది. అయితే, ఈ మోడల్‌ను బీసీసీఐ తిరస్కరించిందని నివేదికలలో తర్వాత పేర్కొంది.

ఇదిలా ఉండగా, 2023 ఆసియా కప్ వేదికను ఖరారు చేసేందుకు, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై స్పష్టత రావడానికి ఇతర దేశాల నుంచి అభిప్రాయాల కోసం ఎదురుచూస్తున్నామని రెండు వారాల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జైషా తెలిపారు.

టోర్నీ రద్దు అవ్వనుందా?

టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిక్కచ్చిగానే ఉంది. దీన్ని చూస్తే, టోర్నమెంట్ (Asia Cup 2023) రద్దు అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఐదు దేశాల టోర్నమెంట్‌కు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు నివేదికలలో పేర్కొంది. ఇది ఖాళీ విండోలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles