AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Ball: వామ్మో.. ఇదేం బౌలింగ్ బ్రో.. 65 వైడ్స్, 15 నో బాల్స్‌తో 92 పరుగులు.. అత్యంత చెత్త రికార్డు ఇదే.. ఆ బౌలర్ ఎవరంటే?

Cricket News: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 నో బాల్స్ విసిరింది. ఆ తర్వాత నో బాల్‌పై చాలా చర్చ మొదలైంది. క్రికెట్ చరిత్రలో నో బాల్ విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టిన ఓ బౌలర్ కూడా ఉన్నాడని మీక తెలుసా?

No Ball: వామ్మో.. ఇదేం బౌలింగ్ బ్రో.. 65 వైడ్స్, 15 నో బాల్స్‌తో 92 పరుగులు.. అత్యంత చెత్త రికార్డు ఇదే.. ఆ బౌలర్ ఎవరంటే?
No Ball
Venkata Chari
|

Updated on: Jan 06, 2023 | 4:30 PM

Share

పూణె వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ నుంచి వార్తల్లో ‘నో బాల్’ న్యూస్ ఎక్కువైంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 7 నో బాల్స్ వేయగా, అందులో 5 అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే విసిరాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 3 నో బాల్‌లు వేసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. అయితే, ఒకే ఓవర్‌లో అదనపు బంతుల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా బంగ్లాదేశ్ బౌలర్ రికార్డు సృష్టించాడు. ఢాకా సెకండ్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ 4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చాడు.

షియోమ్ వర్సెస్ లాల్మతియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ 65 వైడ్ బాల్స్, 15 నో బాల్స్ వేశాడు. అయితే, ఆ తర్వాత ఈ విషయంపై విచారణ జరిగింది. బ్యాట్స్‌మన్ 4 సరైన బంతుల్లో 12 పరుగులు చేశాడు.

అంపైర్‌పై వ్యతిరేకతతోనే..

లాల్మాటియా బౌలర్ సుజోన్ మహమూద్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు. అతను అంపైర్ తప్పిదాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బర్ట్ పేరిట ఉంది. అతను వెల్లింగ్టన్ తరపున ఆడుతున్నప్పుడు కాంటర్బరీపై 22 బంతుల్లో 77 పరుగులు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

షమీ పేరుపైనా చెత్త రికార్డు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించిన మహ్మద్ సమీ పేరు మీద ఉంది. ఒకే ఓవర్‌లో 7 వైడ్‌లు, 4 నో బాల్స్‌తో 17 బంతులు వేశాడు. బంగ్లాదేశ్‌పై ఒకే ఓవర్‌లో 22 పరుగులు ఇచ్చాడు.

భువనేశ్వర్ పేరిట స్పెషల్ రికార్డు..

అర్ష్‌దీప్ సింగ్ పేరు మీద ఇబ్బందికరమైన రికార్డు నమోదైంది. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్క నోబాల్ కూడా వేయని భారతీయ క్రికెటర్ కూడా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు టీ20లో 298.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను ఒక్కసారి కూడా లైన్ దాటలేదు.

భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి మాట్లాడితే.. భారత్‌ పేలవమైన బౌలింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నో బాల్ విషయంలో అర్ష్‌దీప్ ఇబ్బందికర రికార్డు సృష్టించాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. శివమ్ మావి కూడా 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఈ టార్గెట్‌ను ఛేదించలేక టీమిండియా ఓటమిపాలైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?