AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: వరుస ఓటములతో ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టీ20 సిరీస్ నుంచి ఆరుగురు ఔట్..

India vs Australia, 3rd T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు జరిగాయి. విశాఖపట్నం, తిరువనంతపురంలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు భారత్‌ ఖాతాలో చేరాయి. దీంతో సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజలో ఉంది. ఇప్పుడు గౌహతిలో జరిగే మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

IND vs AUS: వరుస ఓటములతో ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టీ20 సిరీస్ నుంచి ఆరుగురు ఔట్..
Ind Vs Aus 3rd T20i
Venkata Chari
|

Updated on: Nov 28, 2023 | 3:17 PM

Share

India vs Australia, 3rd T20I: భారత్‌తో మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా జట్టులో సగం మందిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఆస్ట్రేలియా ఆరుగురు ఆటగాళ్లకు సిరీస్ మధ్యలో రిటర్న్ హోమ్ టిక్కెట్లను ఇచ్చింది. భారత్‌తో టీ20 సిరీస్ మధ్యలో ఇంటి టిక్కెట్లు కట్ చేసిన ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ పేర్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు మరో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్లందరూ కలిసి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంలేదు. రెండు భాగాలుగా స్వదేశం చేరనున్నారు.

ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్‌, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో సహా 6 మంది ఆటగాళ్లను మినహాయించారు. దీంతో చివరి మూడు T20లకు ఆస్ట్రేలియా కొత్త జట్టును కూడా ప్రకటించింది. T20 సిరీస్ నుంచి వైదొలిగిన ఆటగాళ్లలో, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా ఈ రాత్రి అంటే నవంబర్ 28 న విమానంలో ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. కాగా, మిగిలిన నలుగురు ఆటగాళ్లకు నవంబర్ 29వ తేదీన తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇవి కూడా చదవండి

5 టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-2తో వెనుకంజలో..

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు జరిగాయి. విశాఖపట్నం, తిరువనంతపురంలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు భారత్‌ ఖాతాలో చేరాయి. దీంతో సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజలో ఉంది. ఇప్పుడు గౌహతిలో జరిగే మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. స్మిత్‌, జంపా, మ్యాక్స్‌వెల్‌ వంటి పెద్ద ఆటగాళ్లు లేకపోవడంతో భారత్‌కు ఈ పని సులువవుతోంది.

మిగిలిన 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టు..

ఇప్పుడు భారత్‌తో జరగనున్న మిగిలిన 3 టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అప్‌డేట్ చేసిన జట్టును ప్రకటించింది. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ నిష్క్రమణ తర్వాత కూడా ఈ జట్టు బలహీనంగా కనిపించడం లేదు.

మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డోర్మోట్, జోష్ ఫిలిప్స్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్సన్

ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి కారణం..

ఈ సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన ఆరుగురు ఆటగాళ్లు 2023 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టులో భాగమయ్యారు. నిరంతరం క్రికెట్ ఆడుతున్నారు. అందుకే టీ20 సిరీస్ నుంచి విరామం ఇచ్చారు. అలాగే రాబోయే టెస్ట్ సిరీస్, ఇతర టోర్నమెంట్ల కోసం విశ్రాంతినిచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..