ఆసియా గేమ్స్ షెడ్యూల్ వచ్చేసిందిగా.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
Asian Games 2026 Schedule: జపాన్లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో, మహిళల క్రికెట్ మ్యాచ్లు సెప్టెంబర్ 17న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతాయి. అనంతరం పురుషుల టీ20 ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది.

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబర్ 19న జపాన్లో ప్రారంభం కానున్నాయి. ఈసారి, ఈ క్రీడలు జపాన్లోని ఐచి-నగోయాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆసియా క్రీడలలో క్రికెట్ను మరోసారి చేర్చిన సంగతి తెలిసిందే. చైనాలో జరిగిన గత క్రీడలలో క్రికెట్ను మొదటిసారిగా చేర్చారు. పురుషుల, మహిళల విభాగాలలో భారత్ స్వర్ణ పతకాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, భారత జట్టు మరోసారి స్వర్ణం గెలవాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే, స్వర్ణ పతకం వైపు భారత జట్టు ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఆసియా గేమ్స్ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ విషయం ఇప్పుడు వెల్లడైంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నాడు ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ల షెడ్యూల్ను విడుదల చేసింది. మొదట మహిళల క్రికెట్, ఆ తర్వాత పురుషుల క్రికెట్ ఆడతారు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్నప్పటికీ, క్రికెట్ మ్యాచ్లు సెప్టెంబర్ 17న మొదలవుతాయి. ఎనిమిది జట్లతో మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనుండగా, 10 జట్లతో పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది.
జపాన్తో తలపడనున్న భారత మహిళల జట్టు..
𝐀𝐢𝐜𝐡𝐢-𝐍𝐚𝐠𝐨𝐲𝐚 𝐢𝐬 𝐫𝐞𝐚𝐝𝐲 𝐟𝐨𝐫 𝐬𝐨𝐦𝐞 𝐨𝐟 𝐀𝐬𝐢𝐚’𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐬𝐭𝐚𝐫𝐬 🇯🇵
The 20th Asian Games will see the women’s tournament get underway on September 17 ~ followed by the men’s competition from September 24! 👏#AsianGames2026 #ACC pic.twitter.com/bOamnB5sya
— AsianCricketCouncil (@ACCMedia1) September 7, 2026
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు రెండు ఈవెంట్లలోనూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించాయి. మహిళల ఈవెంట్ నేరుగా క్వార్టర్ ఫైనల్ రౌండ్తో ప్రారంభమవుతుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య జపాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 18న సాయంత్రం 5:30 గంటలకు (IST) జరుగుతుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 20న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. సెప్టెంబర్ 22న కాంస్య పతకం కోసం మ్యాచ్, ఆ తర్వాత స్వర్ణ పతకం కోసం ఫైనల్ జరుగుతుంది.
పురుషుల క్రికెట్ షెడ్యూల్..
పురుషుల క్రికెట్ విషయానికి వస్తే, దీనిని రెండు భాగాలుగా విభజించారు. మొదటగా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, జపాన్, హాంగ్ కాంగ్, మలేషియా, ఓమన్ జట్లు పాల్గొనే గ్రూప్ దశ మ్యాచ్లు జరుగుతాయి. ఈ గ్రూప్ దశ మ్యాచ్లు సెప్టెంబర్ 24 నుంచి 26 తేదీల మధ్య నిర్వహించబడతాయి. ఆ తర్వాత, సెప్టెంబర్ 28న క్వార్టర్-ఫైనల్స్ ప్రారంభమవుతాయి. ఈ రౌండ్లో భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే, గ్రూప్ దశ ముగిసిన తర్వాతే భారత్ ఏ జట్లతో తలపడుతుందో తెలుస్తుంది.
అయితే, షెడ్యూల్ ప్రకారం, భారత జట్టు సెప్టెంబర్ 28న జరిగే రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గ్రూప్ Aలో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. గ్రూప్ Aలో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, జపాన్ ఉన్నాయి. అంటే భారత్ ఈ జట్లలో ఒకదానితో తలపడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు (IST) జరుగుతుంది. ఆ తర్వాత, రెండు సెమీఫైనల్స్ అక్టోబర్ 1న, కాంస్య, స్వర్ణ పతకాల కోసం జరిగే మ్యాచ్లు అక్టోబర్ 3న జరుగుతాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
