AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: వారి ఆట తీరు అద్భుతం.. టీమిండియాపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ కెప్టెన్

ఆసియా కప్ 2025లో భారత జట్టు తన రెండవ మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టీమిండియా గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

Asia Cup 2025: వారి ఆట తీరు అద్భుతం.. టీమిండియాపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ కెప్టెన్
Asia Cup 2025
Rakesh
|

Updated on: Sep 14, 2025 | 7:36 PM

Share

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తి సన్నద్ధమయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టీమిండియా గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ.. టీమిండియా ప్రస్తుతం నిర్భయంగా క్రికెట్ ఆడుతోందని, దీనివల్ల అది ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తోందని అక్రమ్ అన్నారు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దీనికి ఉదాహరణను మనం చూశామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను కూడా అక్రమ్ ప్రశంసించారు.

వసీం అక్రమ్ ఏమన్నారంటే?

వసీం అక్రమ్ సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “టీమిండియా ఆటగాళ్ల మానసిక స్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వారు నిర్భయంగా క్రికెట్ ఆడుతున్నారు. ఇది అకస్మాత్తుగా జరిగినది కాదు, ఇది ఒక ప్రక్రియలో భాగం. భారతదేశంలో జరిగే దేశీయ టీ20 మ్యాచ్‌లు అద్భుతంగా జరుగుతాయి. అక్కడ ఆటగాళ్లకు ట్రైనింగ్, ఈ క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చినప్పుడు, వారు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు” అని అన్నారు. భారత క్రికెట్ వ్యవస్థ దేశీయ క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్లే యువ ఆటగాళ్లు ఇంత ధైర్యంగా ఆడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

అభిషేక్ శర్మను ప్రశంసించిన అక్రమ్..

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ.. “అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. టీ20ఐలలో అతని స్ట్రైక్ రేట్ 190 కంటే ఎక్కువ. అతను వేగంగా పరుగులు సాధిస్తాడు. దీనికి కారణం ఐపిఎల్, భారతదేశ దేశీయ క్రికెట్” అని అక్రమ్ అన్నారు.

ఇదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, వసీం అక్రమ్‌ను “పాకిస్తాన్ జట్టు భారత జట్టుపై గెలుపొందే విశ్వాసం కలిగి ఉందా?” అని ప్రశ్నించారు. దీనికి వసీం అక్రమ్ స్పందిస్తూ, “పాకిస్తాన్ జట్టు ఈ సమయంలో మంచి క్రికెట్ ఆడుతోంది. ఈ జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడటం లేదు. అలాగే, ఆటగాళ్లు యావరేజ్ గురించి కూడా ఆలోచించరు. అందుకే పాకిస్తాన్ జట్టు ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది” అని బదులిచ్చారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..