AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: కౌంటీ బరిలో యాష్… ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!

ఇంగ్లండ్‌తో ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు.

India vs England: కౌంటీ బరిలో యాష్... ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!
ashwin
Venkata Chari
|

Updated on: Jul 08, 2021 | 12:36 AM

Share

India vs England: ఇంగ్లండ్‌తో ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అయితే, జులై 12 వరకు భారత ఆటగాళ్లకు సెలవులు ప్రకటించిన బీసీసీఐ.. ఆ తరువాత ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే, తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ అవకాశం లభించింది. జులై 11న సర్రే టీం తరఫున అశ్విన్ కౌంటీ మ్యాచ్‌ ఆడనున్నాడు. దాంతో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీసుకు ముందు ఈ స్పిన్నర్‌కు మంచి ప్రాక్టీస్‌ దొరకనుంది. ప్రస్తుతం అశ్విన్‌ సైతం ఫ్యామిలీతో కలిసి లండన్‌లోని పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. గతంలో కౌంటీ క్రికెట్ తరపున నాటింగ్‌హామ్‌ షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌కు అశ్విన్ ఆడాడు. యాష్ సర్రే తరఫున సోమర్‌సెట్‌పై ఓవల్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించి, ఇంగ్లండ్ సిరీస్‌లో చెలరేగేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా నాలుగవ టెస్టులో తలపడనుంది. జులై 11న ఈ కౌంటీ మ్యాచ్ ఆరంభం కానుంది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌లో ఓడిపోయాక, విరాట్‌ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచులను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈసీబీ.. బీసీసీఐ విన్నపాన్ని ఓకే చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌కి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హామ్ లో తొలి టెస్టు మొదలుకానుంది. ఇక రెండవ టెస్టు ఆగస్టు 12 నుంచి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో, మూడవ టెస్టు ఆగస్టు 25 నుంచి లీడ్స్‌లో, నాలుగవ టెస్టు సెప్టెంబర్ 2 నుంచి లండన్‌లో, ఐదవ టెస్టు సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

మరోవైపు, ఇంగ్లండ్ టీం పాకిస్తాన్ తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 8 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్.. జులై 13తో ముగుస్తుంది. అలాగే జులై 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, జులై 20తో టీ20 సిరీస్ ముగుస్తుంది.

Also Read:

Lionel Messi: ఒక్క గోల్ తో రికార్డు బ్రేక్ చేసిన లియోనల్‌ మెస్సీ… ( వీడియో )

India vs Srilanka: శిఖర్ టీం ద్వితీయశ్రేణిది కాదు.. శ్రీలంకకు పంపినందుకు సంతోషించాలి: పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..