Video: ఫైనల్లో గొడవ.. కోపంతో బంతి విసిరిన అర్షదీప్.. డారెల్ మిచెల్ ఏం చేశాడంటే?
Arshdeep Singh Daryl Mitchell Fight: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, డారిల్ మిచెల్, ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గొడవ పడ్డారు. కోపంతో ఉన్న అర్ష్దీప్ సింగ్ మిచెల్ను బంతితో కొట్టడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.

Arshdeep Singh Daryl Mitchell Fight: ఐసీసీ మెన్స్ టీ 20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు (India national cricket team) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) మధ్య జరిగిన పోరు ఆసక్తికర మలుపు తీసుకుంది. మ్యాచ్ సమయంలో భారత వేగబౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డారెల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంది.
అర్షదీప్పై దాడి చేసిన మిచెల్ బ్యాటింగ్..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 11వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్కు వచ్చాడు. ఆ ఓవర్లో డారెల్ మిచెల్ వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో అర్షదీప్ కొంత ఆగ్రహానికి గురయ్యాడు.
ఐదవ బంతిపై మిచెల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి నేరుగా అర్షదీప్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో అర్షదీప్ కోపంతో బంతిని మిచెల్ వైపు విసిరాడు. దీంతో మిచెల్ తీవ్రంగా ఆగ్రహించి అర్షదీప్పై గట్టిగా మాట్లాడాడు.
సూర్యకుమార్ యాదవ్ జోక్యం..
The heated moment between Arshdeep Singh and Daryl Mitchell. 😯🔥
– Arshdeep singh deliberately threw ball towards Daryl Mitchell and hit him – Mitchell got angry after that and started abusing him -Surya came and started consoling him…..See more pic.twitter.com/uBBfjyiqEs
— Indian Cricket (@IPL2025Auction) March 8, 2026
ఈ ఘటన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని శాంతింపజేశాడు. అంపైర్లు కూడా అర్షదీప్ను పిలిచి ఇలా చేయకూడదని హెచ్చరించారు. అర్షదీప్ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ మళ్లీ సాధారణంగా కొనసాగింది.
రెండు పరుగుల తర్వాత మిచెల్ ఔట్..
ఈ ఘటన తర్వాత డారెల్ మిచెల్ ఫోకస్ కోల్పోయాడు. తన స్కోర్కు కేవలం రెండు పరుగులు మాత్రమే జోడించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (Axar Patel) బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
భారత బ్యాటింగ్ ప్రదర్శన..
ఈ ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ అద్భుతంగా ఆడారు.
సంజూ శాంసన్ (Sanju Samson) – 89 పరుగులు
అభిషేక్ చక్రవర్తి (Abhishek Sharma) – 21 బంతుల్లో 52 పరుగులు
ఇషాన్ కిషన్ (Ishan Kishan) – 25 బంతుల్లో 54 పరుగులు
ఈ అద్భుత బ్యాటింగ్తో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
