AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పాకిస్తాన్ నుంచి ఒకరు.. భారత్ నుంచి మరొకరు.. మెగా వేలంలో ఇద్దరు స్పెషల్ ఆటగాళ్లు ఎంట్రీ?

IPL 2025 Auction: ప్రపంచవ్యాప్తంగా 1574 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా, 1000 మందిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలం నుంచి తప్పించింది. దీంతో ఆరు రోజుల్లో జరగనున్న మెగా వేలంలో గరిష్టంగా 574 మంది ఆటగాళ్లను మాత్రమే తమ లక్‌ను చెక్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

IPL 2025: పాకిస్తాన్ నుంచి ఒకరు.. భారత్ నుంచి మరొకరు.. మెగా వేలంలో ఇద్దరు స్పెషల్ ఆటగాళ్లు ఎంట్రీ?
Ipl 2025 Mega Auction
Venkata Chari
|

Updated on: Nov 18, 2024 | 8:57 AM

Share

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెడ్డాలో జరగనుంది. రిటెన్షన్ జాబితా ప్రకటించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా 1574 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం నమోదు చేసుకున్నారు. అయితే, వీరిలో 1000 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రేసు నుంచి తప్పించింది. ఇప్పుడు మెగా వేలంలో గరిష్టంగా 574 మంది ఆటగాళ్లను మాత్రమే వేలం వేయనున్నారు. ఇందులో పాకిస్థాన్‌లో జన్మించిన ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ పేరు కూడా ఉంది.

మెగా వేలానికి పాకిస్థాన్‌లో పుట్టిన ఆటగాడు..

అలీఖాన్ పాకిస్థాన్‌లో జన్మించినప్పటికీ, 18 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లాడు. ఆ తరువాత, అతను చాలా కష్టపడి USA జాతీయ జట్టులో తన స్థానాన్ని పొందాడు. అలీ ఖాన్ ఇప్పుడు మెగా వేలంలో ఏ జట్టులోనైనా భాగం కావొచ్చు. అలీ ఖాన్ ఇంతకు ముందు కూడా ఐపీఎల్‌లో భాగమయ్యాడు.

2020లో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ 33 ఏళ్ల బౌలర్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, అతను సీజన్‌లో ఏ మ్యాచ్‌ను ఆడలేకపోయాడు. అలీ ఖాన్ ILT20 లీగ్‌లో KKR ఫ్రాంచైజీ జట్టులో భాగమయ్యాడు. అలీఖాన్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. ఈ సమయంలో అతను రెండుసార్లు 4 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

అసోసియేట్ నేషన్స్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు మెగా వేలంలో..

366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు మెగా వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో అసోసియేట్ నేషన్స్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. అలీ ఖాన్‌తోపాటు మిగిలిన ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ఉన్ముక్త్ చంద్, బ్రాండన్ మెక్‌ముల్లెన్. ఉన్ముక్త్ చంద్ భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు 2012లో ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది.

అయితే, ఇప్పుడు భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఉన్ముక్త్ చంద్ యూఎస్ఏ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మూడు జట్లకు ఆడాడు. ఉన్ముక్త్ చివరిసారిగా 2016లో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.

బ్రాండన్ మెక్‌ముల్లెన్ స్కాట్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 26 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఈ సమయంలో, అతను బంతితో పాటు బ్యాట్‌తో కూడా మంచి ప్రదర్శన చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..