Emotional Krunal Pandya: ‘నాన్నకు అంకితం..’ అరంగేట్రంలోనే దుమ్మురేపిన కృనాల్​ పాండ్య

డెబ్యూ మ్యాచ్​లోనే టీమిండియా ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో 58 పరుగులు చేసిన కృనాల్​..

Emotional Krunal Pandya: 'నాన్నకు అంకితం..' అరంగేట్రంలోనే దుమ్మురేపిన కృనాల్​ పాండ్య
Krunal Pandya01
Follow us

|

Updated on: Mar 24, 2021 | 1:10 AM

డెబ్యూ మ్యాచ్​లోనే టీమిండియా ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో 58 పరుగులు చేసిన కృనాల్​.. మొదటి మ్యాచ్​లో అతి తక్కువ బంతుల్లో(26) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు.. ఈ రికార్డు న్యూజిలాండ్​ ఆటగాడు జాన్​ మారిస్​ (35 బంతులు) పేరిట ఉంది.

అయితే మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ తీరును ప్రదర్శించిన కృనాల్​ పాండ్య.. ఒక సమయంలో భావోధ్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ​అనారోగ్యం కారణంగా కృనాల్​ తండ్రి కొన్ని నెలల క్రితం మృతి చెందారు. అంతకుముందు డెబ్యూ మ్యాచ్ సందర్భంగా  టీమిండియా క్యాప్​ను.. తన సోదరుడు హార్దిక్​ నుంచి అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు కృనాల్​. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

‘నాన్నకు అంకితం..’అరంగేట్రం అన్న భావనే లేకుండా స్వేచ్ఛగా ఆడి హాఫ్ సెంచరీ  అందుకున్నాడు కృనాల్​. 7 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్​ను తన తండ్రికి అంకితమిచ్చాడు.

ఇవి కూడా చదవండి: విశాఖ కార్మిక సంఘాల ఆందోళనకు ప్రభుత్వ మద్దతు, 26న మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ – పేర్ని నాని