ఐపీఎల్ మ్యాచ్లపై సందిగ్ధత
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. జనం సమాహాం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లో పూర్తిగా నిషేధ అంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ వాయిదాపై సందిగ్ధత నెలకొంది. దీంతో దేశంలో విశేష ఆదరణ కలిగిన ఐపీఎల్ భవితవ్యం కూడా దీనిమీదే ఆధారపడింది
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. జనం సమాహాం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లో పూర్తిగా నిషేధ అంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ వాయిదాపై సందిగ్ధత నెలకొంది. దీంతో దేశంలో విశేష ఆదరణ కలిగిన ఐపీఎల్ భవితవ్యం కూడా దీనిమీదే ఆధారపడింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ నిర్వహణపై నిర్ణయం వెలువడిన వెంటనే ఐపీఎల్ కు సంబంధించిన పనులను బీసీసీఐ వేగవంతం చేయాలని భావిస్తోంది. దాదాపు రూ.4వేల కోట్లతో ముడిపడి ఉన్న లీగ్ ను నిర్వహించేందుకు ఇండియన్ క్రికెట్ బోర్డు అవసరమైన అన్ని చర్యలు మొదలుపెట్టింది. కానీ మొదటి నుంచి ఐపీఎల్పై అయిష్టతతో ఉన్న ఐసీసీ తాజాగా ఎటువంటి ఇబ్బందులు పెడుతుందోనని బీసీసీఐ వేచిచూస్తోంది.