AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Test Championship 2026 : త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఇకపై సింగిల్ టెస్ట్ సిరీస్‌లకు కూడా డబ్ల్యూటీసీ పాయింట్లు

World Test Championship 2026 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు కేవలం 9 జట్లకే పరిమితమైన ఈ మెగా టోర్నీని 12 జట్లకు విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కసరత్తు చేస్తోంది. తదుపరి సైకిల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను కూడా ఈ ఛాంపియన్‌షిప్‌లో చేర్చే అవకాశం ఉంది.

World Test Championship 2026 : త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఇకపై సింగిల్ టెస్ట్ సిరీస్‌లకు కూడా డబ్ల్యూటీసీ పాయింట్లు
World Test Championship 2026
Rakesh
|

Updated on: Apr 11, 2026 | 11:52 AM

Share

World Test Championship 2026 : ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 9 ప్రధాన జట్లు మాత్రమే తలపడుతున్నాయి. అయితే టెస్ట్ క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఐసీసీ ఇప్పుడు 12 జట్ల మోడల్‌ను పరిశీలిస్తోంది. దీనివల్ల పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్ల్యూటీసీకి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం మే నెలలో ఈ మేరకు సిఫార్సులు చేసే అవకాశం ఉంది.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. డబ్ల్యూటీసీలో కనీసం రెండు టెస్టులు ఉన్న సిరీస్‌లనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన క్రికెట్ బోర్డులకు ఒకే ఒక్క టెస్ట్ నిర్వహించడం నష్టదాయకంగా మారింది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై సింగిల్ టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లు కూడా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మారుతాయి. దీనివల్ల పెద్ద జట్లు ఐర్లాండ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లతో ఒక మ్యాచ్ ఆడినా, ఆ పాయింట్లు ఫైనల్ రేసులో లెక్కించబడతాయి. ఉదాహరణకు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ఐర్లాండ్‌లో ఆడే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఇకపై డబ్ల్యూటీసీ పాయింట్ల వేటలో కీలకం కానుంది.

చిన్న జట్లతో టెస్టులు ఆడేందుకు పెద్ద దేశాలు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం వాటికి డబ్ల్యూటీసీ పాయింట్లు లేకపోవడమే. ఒకవేళ ఐసీసీ ఈ కొత్త రూల్‌ను అమలు చేస్తే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు కూడా జింబాబ్వే లేదా అఫ్గాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఇది చిన్న దేశాల్లోని క్రికెటర్లకు మంచి ఎక్స్‌పోజర్‌ను ఇస్తుంది. గతేడాది రెండు డివిజన్ల మోడల్‌ను ఐసీసీ పరిశీలించినప్పటికీ, కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు ఈ 12 జట్ల ఏకీకృత విధానాన్ని తీసుకువచ్చేలా కనిపిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా పెరుగుతున్న తరుణంలో టెస్ట్ క్రికెట్‌ను బతికించుకోవడం ఐసీసీకి సవాలుగా మారింది. 12 జట్ల విస్తరణ వల్ల షెడ్యూలింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అన్ని జట్లకు సమాన అవకాశం కల్పించడం వల్ల ఈ ఫార్మాట్‌కు పునర్వైభవం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే నెలలో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..