AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్మెంట్‌ తరువాత తొలిసారి దుమ్మురేపిన డివిలియర్స్!

రిటైర్మెంట్‌ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌. ఐపీఎల్‌ తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో మిడిలెస్సెక్స్‌ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 43 బంతుల్లో 88 పరుగులు(6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లార్డ్స్‌ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్సెక్స్‌ నిర్దేశించిన […]

రిటైర్మెంట్‌ తరువాత తొలిసారి దుమ్మురేపిన డివిలియర్స్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 5:38 PM

Share

రిటైర్మెంట్‌ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌. ఐపీఎల్‌ తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో మిడిలెస్సెక్స్‌ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 43 బంతుల్లో 88 పరుగులు(6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లార్డ్స్‌ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఎస్సెక్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెస్సెక్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 39 పరుగులకే రెండు వికెట్లు​ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్‌ మలాన్‌తో కలిసి డివిలియర్స్‌ రెచ్చిపోయాడు. వీర్దిదరూ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే మిడిలెస్సెక్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక తొలిసారి టీ20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.