AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండోరోజు పట్టుబిగించిన టీమిండియా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలిరోజు టాప్ అర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరకు గౌరవప్రధమైన స్కోర్ నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు చుక్కలుచూపించారు. రెండో రోజు 203/6 ఓవర్ నౌట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ కట్టడి చేశాడు. 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో […]

రెండోరోజు పట్టుబిగించిన టీమిండియా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2019 | 8:00 AM

Share

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలిరోజు టాప్ అర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరకు గౌరవప్రధమైన స్కోర్ నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు చుక్కలుచూపించారు. రెండో రోజు 203/6 ఓవర్ నౌట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ కట్టడి చేశాడు. 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో విండీస్ కష్టాల్లో పడింది. రోచ్‌ ఒక్కడే 74 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.