AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఘనంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు.. నేడు కన్నులపండువగా స్వర్ణ రథోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగింది. ఈ వసంతోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించాల్సి ఉంటుంది.

Tirupati: ఘనంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు.. నేడు కన్నులపండువగా స్వర్ణ రథోత్సవం
Tirumala
Surya Kala
|

Updated on: May 16, 2022 | 7:37 AM

Share

Tirupati: తిరుచానూరులోని(Tiruchanoor ) శ్రీ పద్మావతి (Sri Padmavati) అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు (Vasanthotsavams) ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపన తిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. ఈరోజు ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరిగింది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని నమ్మకం.

వైభవంగా స్నపనతిరుమంజనం:  వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

ఇవి కూడా చదవండి

ఈ వసంతోత్సవంలో పాల్గొనాలనుకునే గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించాల్సి ఉంటుంది. వసంతోత్సవం కార‌ణంగా ఆదివారం క‌ల్యాణం, ఊంజ‌ల్‌సేవను టీటీడీ రద్దు చేసింది. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి