AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులన్న చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..

శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు భూమన. భగవంతునికి మా కంటే శ్రీవారి సేవకులుగా మీరే ఎక్కువ సన్నిహితులన్నారు. స్వామి వారికి అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రులు కూడా మీరే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 

Tirumala: నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులన్న చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
Srivari Sevaks
Raju M P R
| Edited By: |

Updated on: Oct 19, 2023 | 10:55 AM

Share

వెంకన్న భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనమన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా శ్రీవారి సేవకులు నిలుస్తున్నారన్నారు భూమన. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులతో తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 23 ఏళ్ల క్రితం కేవలం 200 మంది సేవకులతో టిటిడి శ్రీవారి సేవను ప్రారంభించిందన్నారుప్రస్తుతం రోజుకు 2000 మందికి తక్కువ కాకుండా సేవ కొనసాగు తోందన్నారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలో భక్తులకు సేవలందించా రన్నారు.

శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు భూమన. భగవంతునికి మా కంటే శ్రీవారి సేవకులుగా మీరే ఎక్కువ సన్నిహితులన్నారు. స్వామి వారికి అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రులు కూడా మీరే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.  పరమాత్మునికి ఎక్కువ సేవ చేసే సేవకులు కూడా శ్రీవారి సేవకులేనన్నారు. ఒక వేళ మా సేవలో స్వార్థం ఉండొచ్చు గానీ, శ్రీవారి సేవకుల సేవలో ఏ స్వార్థం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

జీతం, భత్యం లేదన్న

భగవత్ సన్నిధానంలోనే సేవ చేయాలనే భావనతో కాకుండా.. ఇక్కడ ఏది ఇచ్చినా అది భగవంతుని సేవ అనుకునే శ్రీవారి సేవకుల కంటే భగవత్ సేవకులు ఇంకెవరూలేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి సేవకులు 15 లక్షల మందికి పైగా సేవకులు ఉండడం సామాన్యమైన విషయం కాదంటూ.. 2003 నుంచి ఎంతో డిమాండ్ తో కూడు కున్న సేవలా శ్రీవారి సేవ మారిందన్నారు. స్వామి వారి సేవలో తరించాలని తపనతో శ్రీవారి సేవకులు ఉన్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి