AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Devi: రావణుడిని కేవలం చూపుతోనే భస్మం చేసే శక్తి సీతాదేవి సొంతం.. అయినా రామయ్య కోసం ఎందుకు చూసిందో తెలుసా..

హిందూ మతంలో ఆదర్శ మహిళ అంటే సీతాదేవి. శ్రీ మహా లక్ష్మి అవతారం అయిన సీతాదేవి విష్ణువు అవతారమైన శ్రీ రాముడు పత్ని. తన నడకతో నడతతో సీతాదేవి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచిపోయింది. రావణుడు సీతను అపహరించినప్పుడు.. ఆమె కోరుకుంటే ఆమె ఒక్క చూపుతో రావణుడిని బూడిద చేసి ఉండేది.. అయినా ఆమె అలాంటిదేమీ చేయలేదు. తనను రావణుడి చెర నుంచి విడిపించేందుకు సీతా దేవి తన భర్త శ్రీరాముని కోసం వేచి ఉంది. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది.

Sita Devi: రావణుడిని కేవలం చూపుతోనే భస్మం చేసే శక్తి సీతాదేవి సొంతం.. అయినా రామయ్య కోసం ఎందుకు చూసిందో తెలుసా..
Sita Devi
Surya Kala
|

Updated on: May 04, 2025 | 6:57 PM

Share

సీతాదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. రామాయణంలో సీతదేవిని ఓపిక, ప్రకాశవంతమైన, అంకితభావం కలిగిన మహిళగా చిత్రీకరించారు. ఆమె అపారమైన శక్తి కలిగిన స్త్రీ మూర్తి. ఆమె కోరుకుంటే రావణుడు తనని అపహరించే సమయంలో ఒక్క చూపుతో రావణాసురుడిని దహనం చేసే శక్తి కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు తనని అశోక వనంలో బందీగా చేసిన సమయంలో కూడా రావణుడిని శిక్షించే శక్తి ఆమెకు ఉంది. అయినప్పటికీ ఆమె అలా చేయలేదు. రాముడి చేతిలో రావణుడి మరణం ఖాయమని సీతాదేవికి తెలుసు. అందుకనే తన భర్తని గౌరవాన్ని.. ధర్మాన్ని అనుసరిస్తూ స్వయంగా ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాదు సీతాదేవి.. దశరథ మహా రాజుకు చేసిన వాగ్దానం కారణంగా కూడా అలా చేయలేదు.

గడ్డి కూడా బూడిద అయిపోయింది

పురాణాల ప్రకారం సీత దేవి శ్రీరాముడిని వివాహం చేసుకుని.. తన అత్తమామల ఇంటికి వచ్చిన తర్వాత.. సీతదేవి మొదట ఋషులు, కుటుంబ సభ్యుల కోసం పాయసం చేసింది. ఆమె వారికి పాయసం వడ్డిస్తుండగా, బలమైన గాలి వీచింది. అందరూ తమ తమ ప్లేట్లను జాగ్రత్తగా చూసుకున్నారు.. అయితే ఆ సమయంలో దశరథుని పాయసంలో ఒక చిన్న గడ్డి ముక్క పడింది. అప్పుడు సీతదేవి పాయసంలో పడిన గడ్డిని చూసింది. ఆమె పాయసంలోని ఈ గడ్డిని ఎలా తీయాలి అని ఆలోచించడం ప్రారంభించింది. అది ఆమెకు పెద్ద సందిగ్ధంగా మారింది. తర్వాత దూరం నుంచి తీక్షణ దృష్టితో గడ్డిని చూసింది. సీతాదేవి చూపుతోనే ఆ గడ్డి బూడిదగా మారిందని అంటారు. సీతా దేవి ఇలా చేసినప్పుడు తనని ఎవరూ చూడలేదని భావించింది. అయితే దశరథ మహా రాజు ఇదంతా చూశాడు. తన కోడలు సీతాదేవి తన సాధారణ మహిళ కాదని.. ప్రపంచానికే తల్లి అని, శక్తి స్వరూపిణి అని దాశరధ మహారాజు అర్థం చేసుకున్నాడు.

మామగారికి వాగ్దానం చేసిన సీతాదేవి

పాయసం తిన్న తర్వాత దశరథ మహారాజు తన గదిలోకి వెళ్ళాడు. ఆ తరువాత అతను తన కోడలైన సీతాదేవిని తన గదికి పిలిచి.. ఆమె చేసిన అద్భుతం గురించి తనకు తెలుసునని చెప్పాడు. దశరధుడు అమ్మా… ఈ రోజు నేను నీ అద్భుతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాను” అని అన్నాడు. మీ దృష్టిలో ఉన్న శక్తి అతీంద్రియమైనది. చాలా ప్రేమగా సీతదేవితో అమ్మా.. నువ్వు ఆ గడ్డిని చూసిన దృష్టితో పొరపాటున కూడా నీ శత్రువును ఎప్పుడూ చూడకు. మీ కళ్ళలో ఎల్లప్పుడూ కరుణ, ప్రేమని నిలుపుకోండి. మీ దృష్టి, మీ శక్తి రక్షణ, సంక్షేమం కోసమే ఉపయోగించాలి, విధ్వంసం కోసం కాదని చెప్పాడు దాశరధ మహారాజు. ఈ కారణంగానే సీతదేవి రావణుడిని దహనం చేయలేదు.. శ్రీరాముడి కోసం వేచి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం