
భారతీయులకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. సీతా దేవి ఆయన ధర్మపత్నిగా పూజలందుకుంటుంది. రామ మందిరాలు, రామాలయాలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి పూజలందుకుంటూ కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. రామాలయంలో ఆదర్శ దంపతులైన సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా భక్తులతో పూజలను అందుకుంటారు. అయితే హనుమంతుడికి విడిగా ఆలయాలు కనిపిస్తాయి. కానీ ఒక్క సీతాదేవిని పూజించే ఆలయాలు మాత్రం ఉంటాయని ఊహించి ఉండరు కూడా.. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వల్లూరు గ్రామంలో బాల సీత దేవికి ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేసి దశాబ్ధాలుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
అయోధ్యలో బాలరాముడు పూజలందుకుంటున్నాడు. మరి అయోనిజ అయిన సీతా దేవిని బాలిక రూపంలో కొలిచే ఆలయంను కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించారు. పాలరాతితో నిర్మలంగా కనిపించే ఆ బాల సీతకు నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. అంతేకాదు సీతా దేవి సంపదకు, త్యాగానికి, సహనానికి, ధైర్యానికి, నిర్మలత్వానికి ప్రతీక ఆమెకు ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరులో వ్రతం ఆచరిస్తారు. సీతాదేవి పాదాలు సైతం ఇక్కడ ఉన్నాయని స్ధానికులు చెబుతారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వికులు ఈ ఆలయానికి స్ధలం ఇచ్చారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..