Navratri 2025: ఈ ఏడాది నవరాత్రి 9 రోజులు కాదు, 10 రోజులు.. దుర్గామాత ఆశీస్సులు రెట్టింపు

హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. 2025 సంవత్సరంలో శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈసారి నవరాత్రి పండుగ 9 రోజులకు బదులుగా 10 రోజులు జరుపుకొనున్నారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే..

Navratri 2025: ఈ ఏడాది నవరాత్రి 9 రోజులు కాదు, 10 రోజులు.. దుర్గామాత ఆశీస్సులు రెట్టింపు
Shardiya Navratri 2025

Updated on: Sep 11, 2025 | 7:43 AM

2025 సంవత్సరంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దుర్గాదేవి ఆరాధనకు దేవీ నవరాత్రి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడుతుంది. ఈ సమయంలో ఆరాధన వ్యక్తి జీవితంలోని అన్ని దుఃఖాలను, బాధలను తొలగిస్తుంది.

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 1 వరకు కొనసాగుతాయి. మహానవమి అక్టోబర్ 1న వచ్చింది. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2న దసరా లేదా విజయదశమితో ముగుస్తాయి. ఆ రోజునే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు.

2025 సంవత్సరంలో అరుదైన యాదృచ్చికం

ఇవి కూడా చదవండి

2025 సంవత్సరంలో నవరాత్రి రోజున అరుదైన యాదృచ్చికం ఏర్పడనుంది. ఈసారి నవరాత్రి ఉత్సవాలను 9 రోజులకు బదులుగా 10 రోజులు నిర్వహించనున్నారు. కనుక ఈ ఉత్సవాల్లో అదనపు రోజు దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం..

నవరాత్రి 9 రోజులు కాదు, 10 రోజులు

2025 సంవత్సరంలో శారదీయ నవరాత్రి 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు. ఈసారి తృతీయ తిథి రెండు రోజులు ఉంటుంది. దీని కారణంగా శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది.

నవరాత్రిలో తేదీ పెరగడంలో ప్రాముఖ్యత

నవరాత్రిలో ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు. అయితే క్షీణిస్తున్న తిథిని అశుభంగా భావిస్తారు. నవరాత్రిలో ఉదయించే తిథి బలం, ఉత్సాహం, సానుకూల శక్తికి చిహ్నం.

శారదీయ నవరాత్రి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెరుగుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ సమయం చాలా సానుకూలంగా, శక్తి అభివృద్ధికి ఒక కారణంగా పరిగణించబడుతుంది.

ఉదయించే తిథి కొత్త ప్రారంభాలు, సృష్టి , పురోగతిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే సాధన ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

శారదీయ నవరాత్రుల ప్రాముఖ్యత

శారదీయ నవరాత్రులలో ఉపవాసం, ధ్యానం , దుర్గాదేవిని పూజించడం ద్వారా భక్తులు తమ అంతర్గత శక్తిని మేల్కొలిపి.. జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు