AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tribals festival: పొలంలో మైసమ్మకు పందిబలి ఆచారం.. ఇప్ప పువ్వు సారాతో నైవేద్యం.. ఎక్కడంటే..

సాధారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తుంటారు. కొందరు కోళ్లు, మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తుంటారు కానీ, ఓ చోట అమ్మవారికి పందిని బలిస్తారట. వినడానికి వింతగా అనిపించినా..

Tribals festival:  పొలంలో మైసమ్మకు పందిబలి ఆచారం.. ఇప్ప పువ్వు సారాతో నైవేద్యం.. ఎక్కడంటే..
Mulugu,tribals
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2022 | 9:12 PM

Share

సాధారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తుంటారు. కొందరు కోళ్లు, మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తుంటారు కానీ, ఓ చోట అమ్మవారికి పందిని బలిస్తారట. వినడానికి వింతగా అనిపించినా, దాని వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు అక్కడి భక్తులు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరూ..ఎక్కడ ఇలాంటి వింత ఆచారం కొనసాగుతుంది.. ఎందుకు పందిని బలి ఇస్తారనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలో ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు కొందరు గిరిజనులు. ఏటూరునాగారం పరిధిలోని ఇప్పలగడ్డ తండాలోని గిరిజనులు ఆనాదిగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి గిరిజనులు ఏటా మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు. దీనినే విత్తనం పండుగ అని పిలుస్తుంటారు. ఈ పండగ కోసం గిరిజన పెద్దలంతా కలిసి ప్రతి కుటుంబం నుంచి కొంత మొత్తంలో డబ్బులు పోగు చేసుకుంటారు. పోగుచేసిన డబ్బులతోనే విత్తనం పండుగను నిర్వహిస్తుంటారు. ప్రతి కుటుంబం నుంచి తెచ్చిన ధాన్యాలను కొన్ని భూదేవి వద్ద నాటుతారు. అనంతరం పొలం వద్దకు వెళ్లి మైసమ్మకు జంతు బలి సమర్పిస్తారు. పొలాల మధ్యలో ఉండే మైసమ్మ తల్లికి పందిని బలి ఇవ్వడం వల్ల పైరుకు మంచిదని, పంటను నాశనం చేసే పందులు మేలు చేస్తాయని వారి నమ్మకం..భూదేవికి పూజ, మైసమ్మకు జంతు బలి తర్వాత ఈ పండుగలో గ్రామ దేవతలకు ఇప్ప పువ్వులతో చేసిన సారాయిని నైవేద్యంగా ఆరబోస్తారు గిరిజనులు.

ఈ పండుగను జరుపుకోవడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. ఈ సంప్రదాయం పూర్వీకుల నుంచి కొనసాగుతుంది..అయితే, గ్రామంలో అందరు సమానమే అన్న భావన వచ్చేలా బలి ఇచ్చిన పంది మాంసంతో ఊరు పెద్దలందరూ సామూహిక విందు భోజనాలు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ పనులు మొదలు పెడతారు..ఈ సాంప్రదాయం కేవలం గిరిజనులలో మాత్రమే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే