AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GaneshChaturthi: కోర్కెలు తీర్చే చింతామణి గణపతి.. అనుగ్రహం ఉంటే చాలు.. ఎంత‌టి క‌ష్టాలైనా తొల‌గిపోవాల్సిందే..! ఎక్కడంటే..

ఈ గణపతి విగ్రహాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని కూడా చెబుతారు. గణేశ పురాణం కూడా దీని గురించి ప్రస్తావించింది. చింతామణి గణపతి

GaneshChaturthi: కోర్కెలు తీర్చే చింతామణి గణపతి.. అనుగ్రహం ఉంటే చాలు.. ఎంత‌టి క‌ష్టాలైనా తొల‌గిపోవాల్సిందే..! ఎక్కడంటే..
Chintamani Ganpati
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2022 | 6:05 PM

Share

GaneshChaturthi: చింతామణి గణపతి విదర్భ ప్రజల ఆరాధ్య దైవం. భక్తుల చింతలు తీరుస్తూ వారిచే ‘చింతామణి గణపతి’ గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ చింతామణి దేవాలయం యావత్మాల్ నుండి 22 కి.మీ దూరంలో కలాంబ్ వద్ద ఉంది. ఈ గణపతిని వేల సంవత్సరాల క్రితం స్థాపించబడిందని నమ్ముతారు. ఈ గణపతి విగ్రహాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని కూడా చెబుతారు. గణేశ పురాణం కూడా దీని గురించి ప్రస్తావించింది. చింతామణి గణపతి భక్తులకు ఆందోళనను దూరం చేస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి పన్నెండు నెలలకోసారి వినాయకుని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. ఈ రోజు మనం ఈ చింతామణి గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం.

ఇక్కడి సరస్సులో శ్రీ చింతామణి దేవాలయం స్థాపించబడింది. ఇది పురాతన దేవాలయం. ఇది భూమి నుండి దాదాపు 30 అడుగుల లోతులో ఉంది. ఈ దేవాలయం హేమడ్పంతి. ఆలయానికి మూడు వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారంలోనే నాలుగు ముఖాల వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం రాతితో చెక్కబడింది. విగ్రహం చేతులు కలిపి ఉన్నాయి. భారతదేశంలోని ఏకైక వినాయక విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటుందని చెబుతారు.

కలాంబ్ వద్ద ఉన్న ఆలయంలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే,..ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గంగ దిగివస్తుందట. దీని వెనుక కూడా ఓ కథ ఉందంటున్నారు భక్తులు.. దేవతల రాజు ఇంద్రుడు గౌతమ ఋషి భార్యను ఇష్టపడతాడు..కాబట్టి గౌతమ ఋషి అతన్ని శపించాడు. ఆ తరువాత ఇంద్రుడు భయంతో తామరపువ్వు చాటున దాక్కుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ గౌతమున్ని శాంతించమని కోరుతారు.. తనను క్షమించమని కోరుకుంటారు..కానీ, గౌతముడు అందుకు అంగీకరించాడు. అయితే, చింతామణి (గజాననుడి) తపస్సు తర్వాతనే ఇంద్రుడు రక్షింపబడతాడని ఉపశమనం చెబుతాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రుడికి ఓ మంత్రం ఇచ్చాడు. బృహస్పతి ఇంద్రుడిని తామర కాండం నుండి బయటకు తీశాడు. దీని తర్వాత ఇక్కడి సరస్సులో స్నానం చేయాలని సూచిస్తాడు… అతను వేయి సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత, శ్రీ చింతామణి అతన్ని ప్రసన్నం చేసుకుంది. వరం అడగమని చింతామణి కోరింది. అందుకు ఇంద్రుడు, ఓ దేవా నేను నిన్ను మరచిపోకుండా ఉండేలా..ఈ కదంబ వృక్షం వద్దే ఓ నగరాన్ని స్థాపించు. అలాగే నేను స్నానం చేసిన సరస్సుకి చింతామణి సరస్సు అని పేరు పెట్టాలి. ఈ సరస్సులో స్నానమాచరించిన వారి కోరికలన్నీ నెరవేరేలా వరం కోరతాడు.. అందుకు ఇంద్రుడు స్వర్గం నుండి గంగను పిలిచాడు. శ్రీ చింతామణికి స్నానం చేసి ప్రతి పన్నెండేళ్లకోసారి ఈ ప్రాంతానికి రావాలని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ప్రతి పుష్కర కాలానికి గంగ ఇక్కడికి వస్తుంది. అప్పుడే ఇంద్రుడు ఇక్కడ రెండు అడుగుల ఎత్తైన అందమైన స్పటిక గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అదే నేటికీ భక్తులచే పూజలందుకుంటున్న చింతామణి గణపతి విగ్రహమని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి