Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..

|

Apr 06, 2022 | 10:22 AM

Nava Ratri 2022: నవరాత్రుల పర్వదినం సందర్భంగా ఏదైనా శక్తిపీఠాన్ని(Shakti Pitha) సందర్శించడం, పూజించడం వలన భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని.. అదృష్టంగా పురాణాల కథనం. సతి భాగవతాలు పడిన 51 ప్రదేశాలు..

Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..
Varanasi Ujjain Shakti Peet
Follow us on

Navaratri 2022: నవరాత్రుల పర్వదినం సందర్భంగా ఏదైనా శక్తిపీఠాన్ని(Shakti Pitha) సందర్శించడం, పూజించడం వలన భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని.. అదృష్టంగా పురాణాల కథనం. సతి భాగవతాలు పడిన 51 ప్రదేశాలు శక్తిపీఠాలుగా పూజింపబడుతున్నాయని ప్రతీతి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ పవిత్ర శక్తిపీఠాల్లో రెండు ప్రసిద్ధ శక్తిపీఠాలు నవరాత్రి సందర్భంగా దర్శించుకుంటారు. ఈ క్షేత్రాలను సందర్శించినప్పుడు అమ్మవారి దివ్యమైన రూపాన్ని మాత్రమే కాకుండా, లయకారుడు శివుడి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఈ రెండు శక్తిపీఠాలు భారతదేశం(India)లోని పురాతన నగరాలు అంటే కాశీ(Kashi), ఉజ్జయిని(Ujjain)లో ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో శివుడిని.. శక్తిస్వరూపిణీతో కలిపి దర్శించుకోవచ్చు. ఈరోజు  దేశంలోని ఈ రెండు పవిత్ర శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం..

కాశీలో బాబా విశ్వనాథ్, విశాలాక్షి అమ్మవారి ఆలయం:  వారణాసి నగరాన్ని కాశి విశ్వనాథ నగరం అని పిలుస్తారు. ఈ పురాతన పవిత్ర నగరంలో అనేక శక్తి పీఠాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైన ఆలయం విశాలాక్షి ఆలయం. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. వారణాసిలోని ఈ పవిత్రమైన అమ్మవారి ఆలయ నిర్మాణంలో దక్షిణ భారతీయ కళాఖండాలను చూడవచ్చు. వారణాసి ఆలయ పరిసరాల్లో సతీదేవి చెవి పడిందని పురాణాల ప్రకారం తెలుస్తోంది.

చైత్ర నవరాత్రులలో ఏ రోజుల్లో ప్రత్యేక దర్శనం అంటే..: కాశీలో ఉన్న ఈ శక్తిపీఠంమైన విశాలాక్షి అమ్మవారి ఆలయంలో రెండు విగ్రహాలను చూడవచ్చు. వాటిలో ఒకటి కదలనిదిగా,మరొకటి కదిలేదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రెండు విగ్రహాలను సమానంగా పూజిస్తారు. చైత్ర నవరాత్రులలో.. పంచమి రోజున నవ గౌరీగా విశాలాక్షి అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం మీర్ఘాట్ ప్రాంతంలో, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం సమీపంలో ఉంది. చైత్ర నవరాత్రుల్లో వారణాసికి వెళితే.. శివ సమేతంగా ఉన్న విశాలాక్షి అమ్మవారి పవిత్ర శక్తిపీఠాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.

ఉజ్జయినిలోని శక్తి పీఠం: ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు అమ్మవారు మహంకాళిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. ఉజ్జయినిలోని ఈ శక్తిపీఠంలో సతీదేవి కుడి మోచేయి ఈ ప్రదేశంలో పడిందని పురాణాల కథనం.  ఈ పవిత్ర శక్తిపీఠం మహాకాళేశ్వర ఆలయానికి సమీపంలో రుద్రసాగర్ చెరువు పశ్చిమ ఒడ్డున ఉంది.

 కోరిన కోరికలు నెరవేర్చే దీపం: 
హరసిద్ధి దేవి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. కేవలం మోచేతి మాత్రమే హరిసిద్ధి దేవిగా పూజించబడుతుంది. అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వెంటనే రెండు పెద్ద దీపస్తంభాలు.. ఆ స్థంభం స్త్రీ, పురుషులకు చిహ్నంగా పరిగణించబడుతుంది.  ఈ దీపపు స్తంభాలోని కుడి వైపున ఉన్న నిలువు వరుస పెద్దది, ఎడమ వైపున చిన్నది. ప్రజలు దీనిని శివ-శక్తి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ దీప స్తంభంపై దీపం వెలిగిస్తే.. ఎటువంటి కోరికలైన నెరవేరతాయని.. భక్తుల నమ్మకం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Newborn Girlchild: తమ ఇంట పుట్టిన ఆడపిల్లకు ఘన స్వాగతం.. ఏకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు.. ఎక్కడంటే..

Madhya Pradesh: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? తల్లి శవాన్ని మంచంమీద పెట్టుకుని మోసుకెళ్లిన కూతుళ్లు.. వీడియో వైరల్