Kartika Purnima 2023: ఈ ఏడాదిలో భద్ర నీడలో కార్తీక పున్నమి.. ఏ రోజున పూజ శుభప్రదం అంటే..

సూర్యోదయానికి ముందు కార్తీక స్నానం చేసే సంప్రదాయం ఉంది. సూర్యోదయానికి ముందు స్నానం చేసి, దానధర్మాలు చేసి పూజలు చేయాలి. సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది. శ్రీ మహా విష్ణువు మొదటి అవతారం మత్స్య అవతారం. ఈ అవతారంలో భూమిని రక్షించాడు. కార్తీక పూర్ణిమ రోజున స్నానం చేయడం మత్స్యావతార జ్ఞాపకార్థం కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. పాతాళం నుండి విష్ణువు భువి మీదకు వచ్చిన తర్వాత ఇది మొదటి ప్రధాన పండుగ. దీనిని దేవ దీపావళిగా జరుపుకుంటారు.

Kartika Purnima 2023: ఈ ఏడాదిలో భద్ర నీడలో కార్తీక పున్నమి.. ఏ రోజున పూజ శుభప్రదం అంటే..
Kartika Purnima 2023
Follow us

|

Updated on: Nov 25, 2023 | 8:51 AM

కార్తీక పూర్ణిమ రోజున శివ కేశవులతో పాటు లక్ష్మీదేవి, చంద్రుని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. ఈ రోజున చేసే పవిత్ర నదులో చేసే స్నానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక పూర్ణిమ ఉత్తమమైనదిగా చెప్పబడింది. కార్తీక పూర్ణిమ రోజు చాలా పవిత్రమైనది. అందుకే ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కార్తీక పూర్ణిమ రోజున తామసిక ఆహారం తినకూడదని నమ్మకం. కార్తీక పూర్ణిమ రోజున దీపదానం చేసే సంప్రదాయం ఉంది. చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

కార్తీక పూర్ణిమ రోజున భద్ర నీడ

ఈ ఏడాది కార్తీక పూర్ణిమ భద్ర ప్రభావంతో ఉంటుంది. కార్తీక పూర్ణిమ 26 నవంబర్ 2023 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటలకు ప్రారంభమవుతుంది. దీనితో పాటు భద్ర నీడ కూడా ప్రారంభమవుతుంది. భద్ర ప్రభావం 27 నవంబర్ 2023 సోమవారం తెల్లవారుజామున 3:19 వరకు ఉంటుంది. కార్తీక పూర్ణిమ రోజున  ఉపవాసం చేసే వారు నవంబర్ 26 నుండి ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు. 27 నవంబర్ 2023 సోమవారం తెల్లవారుజామున 3:19 తర్వాత చేసే పూజ, స్నానం, దానం ప్రారంభమవుతుంది. నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3.19 గంటల తర్వాత దానం చేయడం ద్వారా కార్తీక మాస స్నాన వ్రతం కూడా పూర్తవుతుంది. 26న కార్తీక పూర్ణిమను జరుపుకుని.. నవంబరు 27న భద్ర నీడ తర్వాత స్నానమాచరించి ఉపవాస దానం చేయడంతో సంకల్పం నెరవేరుతుంది.

కార్తీక పూర్ణిమ నాడు ఇలా పూజించండి

సూర్యోదయానికి ముందు కార్తీక స్నానం చేసే సంప్రదాయం ఉంది. సూర్యోదయానికి ముందు స్నానం చేసి, దానధర్మాలు చేసి పూజలు చేయాలి. సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

శ్రీ మహా విష్ణువు మొదటి అవతారం మత్స్య అవతారం. ఈ అవతారంలో భూమిని రక్షించాడు. కార్తీక పూర్ణిమ రోజున స్నానం చేయడం మత్స్యావతార జ్ఞాపకార్థం కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. పాతాళం నుండి విష్ణువు భువి మీదకు వచ్చిన తర్వాత ఇది మొదటి ప్రధాన పండుగ. దీనిని దేవ దీపావళిగా జరుపుకుంటారు. కార్తిక శుక్ల పక్ష ఏకాదశి నాడు దేవుత్తని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు మేల్కొన్నాడని విశ్వాసం. ఈ రోజు చేసే నదీ స్నానం, ఉపవాసం, దాన విశిష్టమైంది. ఈ రోజున దేశ వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో నిండిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు