AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలతో అభిషేకం చేసిన మహిళలకు సంతానాన్ని వరంగా ఇచ్చే కాళికాదేవి.. ఆలయ విశిష్టత ఏమిటంటే..

అంబాలాలోని  కాళీ దుఖ భంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరతారు.  ఇలా నవరాత్రులలో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయాలలో అంబాలా నగరంలో కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది.

పాలతో అభిషేకం చేసిన మహిళలకు సంతానాన్ని వరంగా ఇచ్చే కాళికాదేవి.. ఆలయ విశిష్టత ఏమిటంటే..
Dukhbhanjani Kali Temple
Surya Kala
|

Updated on: Apr 12, 2024 | 10:37 AM

Share

హిందూ ధర్మంలో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి వివిధ రూపాల్లో పూజిస్తారు. దుర్గాదేవి, కాళిక, లక్ష్మీదేవికి దేశంలో పలు ఆలయాలున్నాయి. అలాంటి పవిత్ర అమ్మవారి ఆలయం ఉత్తర ప్రదేశ్‌లోని అంబాలాలోని కాళికాదేవి ఆలయం. ఇక్కడ కాళిని పూజించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కాళీ దుఖ భంజని ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఇక్కడ ఉన్న అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే ఆ తల్లి దీవెనలు లభిస్తాయని నమ్ముతారు.

పురాతన కాళీ దుఖ భంజని ఆలయం

అంబాలాలోని  కాళీ దుఖ భంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరతారు.  ఇలా నవరాత్రులలో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయాలలో అంబాలా నగరంలో కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది.

సంతానం అనుగ్రహించే కాళికాదేవి

అమ్మవారికి చేయించే పాల స్నానం గురించి ఆలయ పూజారీ మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలోని ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారిని పాలతో స్నానం చేయిస్తారని దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయని చెప్పారు. ఎవరైతే అమ్మవారికి పాలతో స్నానం చేయించి పాలు, పండ్లు సమర్పిస్తారో ఆ స్త్రీలకు సంతానాన్ని  అనుగ్రహిస్తుంది. క్షీరసాగరం అనంతరం ఊరేగింపుగా అమ్మవారు భక్తుల ఇళ్లకు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

6 రకాల వంటకాలు

కాళికా దేవి అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి 56 రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు. అమ్మవారిని పాలతో స్నానం చేయించడం విశేష ఫలితాలను ఇస్తుందని ఆలయానికి వచ్చే భక్తులు చెబుతారు. ఈ రోజున అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే తల్లి సంతోషించి జీవితం సిరిసంపదలతో, సంతానంతో నిండిపోవాలని అనుగ్రహిస్తుందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆలయానికి వస్తున్నామని, తమ ప్రతి కోరికను అమ్మవారు తీర్చిందని భక్తులు సంతోషముగా చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..