AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆలయాలకు వెళ్తే మందు మానేస్తారు.. ఒక్కసారి దర్శించుకుంటే మీ జీవితం మారిపోవడం పక్కా..

మద్యపానం, ధూమపానం లేదా డ్రగ్స్.. ఇవి కేవలం శరీరానికి పట్టే రోగాలు మాత్రమే కాదు, మనిషి సంకల్ప బలాన్ని నీరుగార్చే మానసిక సంకెళ్లు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని కౌన్సిలింగ్‌లు తీసుకున్నా మారని జీవితాలు.. దైవశక్తి తోడైతే అద్భుతంగా మారుతాయని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. వ్యసనాల విష వలయం నుండి బయటపడేసే ఆలయాల గురించి తెలుసుకుందాం..

ఈ ఆలయాలకు వెళ్తే మందు మానేస్తారు.. ఒక్కసారి దర్శించుకుంటే మీ జీవితం మారిపోవడం పక్కా..
How To Quit Addictions Naturally
Krishna S
|

Updated on: Mar 19, 2026 | 1:05 PM

Share

మద్యపానం, ధూమపానం, డ్రగ్స్.. ఇవి కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే కాదు, మనిషి మెదడులోని డోపమైన్ సమతుల్యతను దెబ్బతీసే తీవ్రమైన మానసిక సమస్యలు. ఆధునిక వైద్యం ఎన్ని రకాల చికిత్సలు అందిస్తున్నా.. అంతర్గత శక్తి తోడైతేనే వీటి నుండి పూర్తి విముక్తి సాధ్యం. ఈ నేపథ్యంలో చెడు వ్యసనాల నుండి బయటపడటానికి అద్భుతమైన మార్గాలను చూపుతున్న రెండు పురాతన క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నెరిపురేశ్వరాలయం: అలవాట్లను కరిగించే ఈశ్వరుడు

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో వెలసిన ఈ ఆలయం వ్యసనపరులకు ఒక సంజీవని వంటిది. నెరి అంటే కరిగించడం అని అర్థం. భక్తుల మనసులోని చెడు ఆలోచనలను, అలవాట్లను ఈ స్వామి కరిగిస్తారని నమ్మకం. వ్యసనాలకు లోనైన వారిలో స్వాధిష్ఠాన చక్రం దెబ్బతింటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆ చక్రం తిరిగి సమతుల్యం కావడం ప్రారంభిస్తుందని పండితులు చెబుతారు. ఇక్కడి తీర్థ స్నానం, అభిషేక జలం ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆలయంలో 20 నిమిషాల ధ్యానం మనోచంచలత్వాన్ని తగ్గిస్తుందట. దాదాపు 30 వేల మంది ఇక్కడ స్వామి ముందు ప్రమాణం చేసి వ్యసనాల నుండి బయటపడటం విశేషం.

చెన్నూరు శనేశ్వరాలయం: శని దేవుడి రీసెట్ మోడ్

తీవ్రమైన వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న చెన్నూరు శనేశ్వరాలయం ఒక కఠినమైన మార్గం. శని భగవానుడిని ఇక్కడ మెర్సీలెస్ జడ్జ్‌గా భావిస్తారు. ఆయన ముందు ఒక్కసారి వ్యసనం మానుకుంటానని ప్రమాణం చేస్తే ఆ తర్వాత తిరిగి ఆ తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే వ్యక్తి మనసు రీసెట్ మోడ్‌లోకి వెళ్తుంది. నల్ల నువ్వుల దానం, నువ్వుల నూనె దీపం వంటి ఆచారాలు చెడు కోరికలను నియంత్రిస్తాయి. ఒకప్పుడు కేవలం శిలగా ఉన్న ఈ ప్రాంతం, వ్యసనాల నుండి విముక్తి పొందిన ఒక కుటుంబం కృతజ్ఞతగా నేడు ఒక గొప్ప క్షేత్రంగా వెలిసింది.

వైద్యం + దైవం = సంపూర్ణ మార్పు

ఆధ్యాత్మిక పండితుల ప్రకారం.. ఈ క్షేత్రాల దర్శనం వల్ల బాధితుల్లో నేను మారగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీన్నే ఆయన ప్లేసిబో ప్లస్ బిలీఫ్ ఎఫెక్ట్‌గా అభివర్ణించారు. 11 రోజుల పాటు ఆలయ విభూది, తీర్థం తీసుకోవడం వల్ల మనసుపై నియంత్రణ లభిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం భక్తుల నమ్మకం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us