Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో పూల వర్షం.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేడు వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో పూల వర్షం.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Kumbh Flower
Follow us
K Sammaiah

| Edited By: TV9 Telugu

Updated on: Feb 03, 2025 | 3:31 PM

ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేడు వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు

మరోవైపు ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు.

బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్‌ లైన్‌లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్‌రాజ్‌ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.