AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: కార్తీక మాసంలో శ్రీశైలం సామూహిక గర్భాలయ అభిషేకాల నిలుపుదల.. సాధారణ రోజుల్లో స్పర్శ దర్శనానికి అనుమతి..

కార్తీకమాసంలో రద్దీ రోజుల్లో శ్రీ స్వామి వారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని కార్తీక మాస మంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసామని చెప్పారు. అలానే కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసామన్నారు. శని, ఆది, సోమవారం అలానే రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు.

Srisailam: కార్తీక మాసంలో శ్రీశైలం సామూహిక గర్భాలయ అభిషేకాల నిలుపుదల.. సాధారణ రోజుల్లో స్పర్శ దర్శనానికి అనుమతి..
Srisailam Karthika Masam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 04, 2023 | 8:05 AM

Share

ఇల కైలాసం శ్రీశైలంలో ఈనెల 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి అయితే కార్తీకమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీక మాస మంతా గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు.

అదే విధంగా కార్తీకమాసంలో రద్దీ రోజుల్లో శ్రీ స్వామి వారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని కార్తీక మాస మంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసామని చెప్పారు. అలానే కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసామన్నారు. శని, ఆది, సోమవారం అలానే రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలానే కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు నిర్ణయించామని టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని దేవస్థానం ఈవో పెద్దిరాజు నిర్ణయించారు.

శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..