AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు ఎందుకు కొంటారు? ప్రాముఖ్యత ఏమిటంటే..

అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30 న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజంతా శుభ సమయమే. కనుక ఈ రోజున బంగారం, వెండి వస్తువులతో పాటు కొన్ని రకాల వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, వాటిలో ఒకటి ఉప్పు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాం.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు ఎందుకు కొంటారు? ప్రాముఖ్యత ఏమిటంటే..
Akshaya Tritiya 2025
Surya Kala
|

Updated on: Apr 21, 2025 | 6:50 AM

Share

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30 న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజును స్వయం సిద్ధి ముహూర్తం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున ఎటువంటి శుభ సమయం కోసం చూడకుండానే ఏ పనినైనా చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాటిలో ఒకటి ఉప్పు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాం.

పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక ఆచారాలతో లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని హిందువుల నమ్మకం ఉంది. ఏదైనా కొనడానికి అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైనది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలంటే

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనే సంప్రదాయం కూడా ఉంది. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలి. ఉప్పు కొనడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

చాలా మంది అక్షయ తృతీయ రోజున ఉప్పు కొంటారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనడానికి ఇదే కారణం.

అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఉప్పు కొనాలంటే

అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం శుభప్రదం. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని.. ఇలా చేయడం ద్వారా ఇంటి వాస్తు దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున కొన్న ఉప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవచ్చు. దీని వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చు.

అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పుని కొనడం వల్ల ఏమి జరుగుతుంది?

అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి, మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం చంద్రుడికి సంబంధించినదని నమ్ముతారు. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us