లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్‌ కమిటీ వేసిన షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో లోటస్‌పాండ్‌ వర్గాలు స్పీడ్‌ పెంచాయి. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలిన వైయస్‌ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు..

లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్‌ కమిటీ వేసిన షర్మిల
Follow us

|

Updated on: Mar 19, 2021 | 12:16 PM

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో లోటస్‌పాండ్‌ వర్గాలు స్పీడ్‌ పెంచాయి. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలిన వైయస్‌ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బహిరంగ సభ నిర్వహణపై వైయస్‌ షర్మిల కోర్దినేషన్ కమిటీ వేశారు. దీంతో సభ ఏర్పాట్లు మరింత స్పీడందుకోనున్నాయి.

ఖమ్మం సభ కి రాష్ట్ర వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేయలని లోటస్‌పాండ్‌ వర్గాలు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100మంది ఖమ్మం జిల్లా నేతలు కార్యకర్తలతో వైయస్‌ షర్మిల లోటస్‌పాండ్‌ కార్యాలయంలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖమ్మం సభ నుండి తన పార్టీ పై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు వైయస్‌ షర్మిల. తన పార్టీ పై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చేలా ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో నెలొకొన్న ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామంటూ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతున్నారు. గతంలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించిన షర్మిల.. భైంసా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగి రోజులు గడుస్తున్నా నిందితులకు శిక్ష ఎందుకు పడడంలేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుంది’ అని వైఎస్‌ షర్మిల అన్నారు. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుందని ఆమె వెల్లడించారు. ‘సిటీ ఆఫ్ ఎనర్జీ’ మన రామగుండం అని ఆమె చెప్పుకొచ్చారు. ‘సింగరేణి మనకు తలమానికం.. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు. నారాయణ రెడ్డి, గిద్దే రాములు ఇక్కడి రాములు. అని షర్మిల అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయి, తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో చురుగ్గా అడుగులు వేస్తున్న షర్మిల ఇవాళ కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్‌ లోటస్ పాండ్ ఆఫీస్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిపారు.

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి – కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్.. ఉచిత విద్యుత్ పథకం ఇచ్చింది కూడా కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలు చూసేనని ఆమె చెప్పుకొచ్చారు. ‘సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారు. బ్యాంకుల ద్వారా నేతన్నలకు రుణాలు ఇప్పించారు. కరీంనగర్ జిల్లా ‘రైస్ బౌల్’ అని అనడానికి రాజశేఖర్ రెడ్డే కారణం అని షర్మిల వెల్లడించారు.

ఎల్లంపల్లి, మిడ్ మనేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ దేనని షర్మిల అన్నారు. ‘శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు. రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎస్సార్ ది. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర చాలా ఉంది. ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనిది’. అని షర్మిల చెప్పారు. ‘ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని ఆమె టీఆర్ఎస్ సర్కారుని పరోక్షంగా ప్రశ్నించారు.

‘నేరెళ్ళలో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో దీనిని చూస్తే అర్థం అవుతుంది.. పెద్దపల్లి న్యాయవాదుల హత్యపై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణం. బొంబాయి, దుబాయ్ కి వలసలు ఆగిపోలేదు’ అని షర్మిల కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు, కేసీఆర్ సర్కారు బీడీ కార్మికులను పట్టించుకోలేదని చెప్పిన ఆమె, ‘నా సంకల్పం ఒక్కటే.. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలి. మీరు తోడు ఉంటే ఎంతటి కొండను అయినా ఢీ కొట్టదానికి నేను రెడీ’. అని షర్మిల ప్రకటించారు.

Read More:

నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయం

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్