ఈనెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ చేయనున్న ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్న టెంపుల్‌ సిటీ యాదాద్రిని నిర్మిస్తుంది. రేయింబవళ్లు సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు..

ఈనెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ చేయనున్న ముఖ్యమంత్రి
Follow us

|

Updated on: Mar 02, 2021 | 1:53 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్న టెంపుల్‌ సిటీ యాదాద్రిని నిర్మిస్తుంది. రేయింబవళ్లు సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలుస్తుంది.

యాదాద్రి ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుదిమెరుగుల పనులను పరిశీలించన్నారు. ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలు పరిశీలించే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిశ్చయ జరుగనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యంత్రాంగం సన్నద్ధమైంది. సీఎంవో నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం, పది రోజులుగా కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రధానాలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటం, మరో మూడు మాసాల్లో ఉద్ఘాటనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సీఎం పర్యటనను అధికారికంగా ధ్రువీకరించడం లేదని తెలుస్తోంది.

యాదాద్రి ప్రధానాలయం, పురవీధులు, శివాలయం, పుష్కరిణితో పాటు రింగురోడ్డు నిర్మాణం, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ కారణంగా కేవలం వైటీడీఏ, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులకే పరిమితమై సీఎం పరిశీలన చేస్తారని భావిస్తున్నారు. ఏయే పనులు పూర్తికావల్సి ఉంది, ఎన్ని రోజుల్లో వాటిని పూర్తిచేస్తారని అంచనా వేసేందుకు సీఎం పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. పనుల తీరు తెలుసుకున్నాక చినజీయర్‌ స్వామితో చర్చించి ఆలయ ఉద్ఘాటనపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్ తరాల వారు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం అక్కడ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగుల పనులు చకాచకా సాగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. భూతల స్వరంలా మారిపోయింది.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజాకైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సీఎం కేసీఆర్.. చిన్నజీయర్ స్వామి సలహాను తీసుకోనున్నారు. ఆ తర్వాతే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని.. ఆ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సీఎం భావిస్తున్నారు.

Read more:

కరోనా వైరస్‌తో బీజేపీ ఎంపీ మృతి.. నందకుమార్‌ లేని లోటు తీరనిది అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే