చివరకు జనసేనకు జై కొట్టిన ఎస్పీవై రెడ్డి

అమరావతి: గత కొన్ని రోజులుగా టీడీపీ టికెట్ విషయంలో ఎటూ తేల్చకపోవడంతో సందిగ్ధంలో ఉన్న సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి చివరకు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నికల వేళ టీడీపీకి కర్నూల్ జిల్లాలో పెద్ద షాక్ తగిలనట్టయింది. తన కుమార్తె సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో ఎస్పీవై రెడ్డి జనసేనలో జాయిన్ అయ్యారు. అనారోగ్య కారణాలతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని.. తన కుమార్తె నంద్యాల లోక్‌సభ సీటు కేటాయించాలని కోరగా.. అందుకు చంద్రబాబు […]

చివరకు జనసేనకు జై కొట్టిన ఎస్పీవై రెడ్డి
Follow us

|

Updated on: Mar 20, 2019 | 8:16 PM

అమరావతి: గత కొన్ని రోజులుగా టీడీపీ టికెట్ విషయంలో ఎటూ తేల్చకపోవడంతో సందిగ్ధంలో ఉన్న సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి చివరకు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నికల వేళ టీడీపీకి కర్నూల్ జిల్లాలో పెద్ద షాక్ తగిలనట్టయింది. తన కుమార్తె సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో ఎస్పీవై రెడ్డి జనసేనలో జాయిన్ అయ్యారు. అనారోగ్య కారణాలతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని.. తన కుమార్తె నంద్యాల లోక్‌సభ సీటు కేటాయించాలని కోరగా.. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. ఆ స్థానం నుంచి అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డిని చంద్రబాబు కన్ఫార్మ్ చేశారు. దీంతో ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించారు. గత ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి..టీడీపీ విజయానంతరం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.