Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన ఓ ‘ అబధ్ధాల కోరు’, ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు

ప్రధాని మోదీ ఓ అబధ్ధాల కోరని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రానికి  బీజేపీ గూండాలను తీసుకువస్తున్నదని ఆమె అన్నారు.

ఆయన ఓ ' అబధ్ధాల కోరు', ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 24, 2021 | 6:18 PM

ప్రధాని మోదీ ఓ అబధ్ధాల కోరని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రానికి  బీజేపీ గూండాలను తీసుకువస్తున్నదని ఆమె అన్నారు. బిష్ణుపూర్ లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె..ప్రధాన మంత్రి పదవిని తానెంతో గౌరవిస్తానని, కానీ ఈ ప్రధాని వంటి అబద్ధాలకోరును తాను చూడలేదని అన్నారు. ఆయన అబద్ధాలు మాత్రమే మాట్లాడుతారని, గూండాలంటే ఎవరని ప్రశ్నించిన ఆమె .. బీజేపీ పెడుతున్న టార్చర్ కారణంగా యూపీలోని ఐపీఎస్ అధికారులంతా  తమ ఉద్యోగాలు మానుకుంటున్నారని పేర్కొన్నారు.  బెంగాల్ సంస్కృతిని నాశనం చేసేందుకు బీజేపీ..యూపీ నుంచి గూండాలను తెస్తున్నదని ఆరోపించారు. ఏడాది కాలంగా రైతులు రోడ్డున పడ్డారని, వారిని కేంద్రం అలా చేసిందని అన్నారు. మోదీ, హోం మంత్రి  అమిత్ షా, పారిశ్రామికవేత్త ఆదానీలను ఆమె ముగ్గురు సభ్యుల సిండికేట్ గా అభివర్ణించారు.   దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును కూడా మమత ప్రస్తావించారు. ఇందుకు ఎవరు కారణమన్నారు. ప్రతి వారికీ 15 లక్షలు ఇస్తామని ప్రధాని హామీ ఇఛ్చారని, కానీ ఇచ్చ్చారా అని ప్రశ్నించారు. భేటీ పడావో, భేటీ బచావో అని నినాదం చేశారని, కానీ బాలికల విద్యకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.కానీ తమ ప్రభుత్వం బాలికల స్కాలర్ షిప్ కోసం 1500 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు ఇస్తోందన్నారు.

కాగా ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్న తరుణంలో బెంగాల్ లో ప్రధాన పార్టీలు తమ ప్రచార హోరును పెంచాయి. ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు వివిధ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  ముఖ్యంగా అందరి దృష్టి  నందిగ్రామ్ పై ఉంది. ఇక్కడ టీఎంసి నుంచి   మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి పోటీ చేస్తున్నారు.  వీరు తమ తమ నామినేషన్ల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు, కారుకు కారే కొట్టుకుపోయింది

Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష..

షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ