AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రసవత్తరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక

నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్ధేశంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఓకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కన్పిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు […]

రసవత్తరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 4:35 PM

Share

నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్ధేశంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఓకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కన్పిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది.

ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. లోకల్ గర్నమెంట్ మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారా..? లేక కేంద్రంపై కోపంతో ఈ నామినేషన్లు వేశారా..? అనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రైతులు నామినేషన్లతో ఎవరి ఓటు బ్యాంక్.. దెబ్బతింటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

తెలంగాణలోని 16 సీట్లు గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోంది. వందకు వందశాతం గెలిచే సీట్లలో నిజామాబాద్ ఒకటి. సీటు గ్యారెంటీ – గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. బీజేపీపై కోపంతోనే రైతులు నామినేషన్లు వేశారని.. ప్రజల్లోకి  బలంగా తీసుకెళుతోంది టీఆర్ఎస్. మరోవైపు కవితకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు మధుయాష్కీ, అర్వింద్ కూడా పోటీలో ఉన్నట్లు కనిపించడంలేదు. ఈ ఇద్దరు ప్రత్యర్థులకు కూడా పోటీపై ఆసక్తి లేదు. పార్టీ బలవంతం మీద పోటీ చేస్తుండడంతో టీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదనేది గులాబీ నేతల వాదన.