చిన్న గుడ్లను సరఫరా చేస్తే బ్లాక్‌ లిస్టులో పెడతామన్న మంత్రి.. గతంలో పాలకులు గిరిజనులను పట్టించుకోలేదన్న సత్యవతి రాథోడ్‌

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, పప్పులు, నూనెలు, నిత్యావసరాలు క్రమం తప్పకుండా... నాణ్యత లోపించకుండా సరఫరా..

చిన్న గుడ్లను సరఫరా చేస్తే బ్లాక్‌ లిస్టులో పెడతామన్న మంత్రి.. గతంలో పాలకులు గిరిజనులను పట్టించుకోలేదన్న సత్యవతి రాథోడ్‌
Follow us

|

Updated on: Feb 19, 2021 | 1:10 PM

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, పప్పులు, నూనెలు, నిత్యావసరాలు క్రమం తప్పకుండా… నాణ్యత లోపించకుండా సరఫరా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తెలిపారు. అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు 50 గ్రాముల కంటే తక్కువ ఉండొద్దని నిబంధన పెట్టామని, చిన్న గుడ్లను సరఫరా చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేసి, అధికారులను బాధ్యులు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే గిరిజన సంప్రదాయాలకు, పండగలకు, జాతర్లకు ప్రాధాన్యత లభించిందని అన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలోనే అధికారికంగా జాతరలు నిర్వహించేందుకు నిధులు కేటాయిస్తున్నారని సత్యవతి చెప్పారు. గతంలో ఏ పాలకులు కూడా గిరిజనులు పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు.

మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ది – శిశు సంక్షేమ శాఖల సమీక్షా సమావేశం నస్పుర్ అతిధి గృహంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో నూతన అంగన్వాడీలలో సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలకు వచ్చే పాలను విజయ డైరీ నుంచి తీసుకుంటున్నాం. ఇకపై సమస్యలు రాకుండా సరఫరా జరుగుతుందని అన్నారు. గుడ్ల సరఫరా నెక్(నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ) ద్వారా సరఫరా చేస్తున్నాం. నెక్ కు స్థానిక వ్యవసాయదారులు(గుడ్ల ఉత్పత్తి దారులు) పంపిణీ చేస్తారు. చిన్న గుడ్లు కేంద్రాలకు పంపించకుండా కచ్చితంగా 50 గ్రాములకు తగ్గకుండా ఇవ్వాలని ఆదేశించామని మంత్రి చెప్పారు.

చిన్న గుడ్లు వస్తె వెంటనే ఆ కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్ట్ చేయండి. సీ డి పి ఓ లను బాధ్యులం చేస్తాము. దీనిని సరిగా పర్యవేక్షించేందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్ కు బాధ్యతలు ఇస్తున్నామని చెప్పారు. గుడ్ల కోసం మనం కాంట్రాక్టర్స్ కు మార్కెట్ ధర చెల్లిస్తూ వారికి అన్ని సదుపాయాలు ఇస్తున్నాం. కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్ల విషయంలో రాజీ పడేది లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే గుడ్లలో కూడా వ్యాపార ధోరణి ఉండొద్దు… మానవత్వంతో పని చేయాలని కాంట్రాక్టర్స్ కు చెప్పాము. ప్రతి రోజు క్రమం తప్పకుండా గుడ్లు ఇవ్వాలని అవి కూడా 50 గ్రాముల కు తగ్గకుండా ఇవ్వాలని చెప్పాము. వారు అంగీకరించారు. ఇందులో ఈ మాత్రం తేడా ఉన్నా అధికారులు బాధ్యులను చేసి కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించారు.

పిల్లల్లో పోషకాహార లోపం ఉందని ఒక సర్వే ద్వారా చెప్పడంతో సీఎం కేసిఆర్ ఈ లోపాన్ని నివారించాలని ఆదేశించారు. దీన్ని నివారించేందుకు అధ్యయనం చేస్తున్నాం. త్వరలో పిల్లలకు కూడా పాలు ఇచ్చే ఆలోచన ఉంది, పిల్లల పెరుగుదలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసే విధంగా గ్రోత్ మానిటర్ కార్డ్స్ ఇస్తున్నాం. మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్, చిక్కీలు ఇచ్చే ఆలోచన కూడా ఉందన్నారు మంత్రి. దేశంలో ఎక్కడా లేని మంచి పథకం ఆరోగ్య లక్ష్మిని మన దగ్గర సీఎం కేసిఆర్ ఎంతో మనసు పెట్టీ తీసుకొచ్చారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

గిరిజన ఉత్సవాలు, జతరాలకు సీఎం కేసీఆర్‌ రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ కి ఇబ్బంది ఉన్నా నిధులు ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం గిరిజన సంప్రదాయాలను గౌరవించింది లేదు. వచ్చే ఏడాది ఈ బడ్జెట్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో గిరి వికాసం పథకం కింద రాష్ట్రంలో 105 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ పథకం కింద గిరిజనులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం. ఈ ఏడాది 7500 యూనిట్లను ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాం. గిరిజన తండాలన్నిటికి 3 ఫేస్ కరెంట్ ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్ 220 కోట్ల రూపాయలు ఇచ్చారని, త్వరలో ప్రతి తండా, గిరిజన గ్రామ పంచాయితీకి 3 ఫేస్ కరెంట్ రానుందని అన్నారు.

దండేపల్లి వద్ద శంకుస్థాపన చేసిన బిటి రోడ్డు కు అదనంగా ఊట్ల వరకు ఇంకో 2 కోట్లు కావాలని అడిగారు. దీనికి ప్రతిపాదనలు పంపించండి. వచ్చే కేంద్ర బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీకి వెళ్లి జి.ఓ 3 మీద, గిరిజన విశ్వ విద్యాలయం, ఇతర గిరిజన సమస్యలపై కేంద్రానికి విజ్ఞప్తులు ఇచ్చి వెంటనే పనులు అయ్యే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. సమీక్ష అనంతరం మంచిర్యాలలో నూతనంగా నిర్మిస్తున్న సఖీ కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. బెల్లంపల్లి లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తో కలిసి పూజలు చేశారు.

కోటపల్లి గిరిజన ప్రాంతమని, అక్కడ 5 ఎకరాల భూమి తనది ఇస్తానని..అక్కడ గిరిజనులకు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే ప్రతి పాదనలు పంపంచాలని ఉట్నూర్ ఐటీడీఏ పి.ఓ కు మంత్రి సత్యవతి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరీ, ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి , జిల్లా సంక్షేమ అధికారి రావుఫ్ ఖాన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నారాయణ, సిడిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more:

జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు.. కుంభ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో