AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖబడ్దార్ బీజేపీ! మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి ఎర్రబెల్లి..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ధర్మారెడ్డి ఇంటిని పరిశీలించి, దాడి జరిగిన

ఖబడ్దార్ బీజేపీ! మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి ఎర్రబెల్లి..
uppula Raju
|

Updated on: Feb 01, 2021 | 6:05 AM

Share

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ధర్మారెడ్డి ఇంటిని పరిశీలించి, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. చిల్లర రాజకీయాలతో అల్లరి మానుకోండని, మా సహనాన్ని పరీక్షించవద్దని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించ వద్దని ఖబడ్దార్ బీజేపీ! అంటూ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది వరుసగా నాలుగో దాడని పేర్కొన్నారు.

మొదట ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇంటిపై దాడి,ఆ తర్వాత పరకాల సీఐపై దాడి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో అల్లరి, ఇప్పుడు ఏకంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారన్నారు. పోలీసుల లాఠీల ను గుంజుకుని ఇంటిపై విసిరారు, రాళ్ళు రువ్వారు, ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డారు ఇదేమి రాజకీయమంటూ ప్రశ్నించారు. బీజేపీ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని, దాడులకు దిగుతోందని, గూండా గిరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నిధుల సేకరణపై ధర్మారెడ్డి ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించారు. తన అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే నివృత్తి చేయాలి. కానీ బీజేపీ దౌర్జన్యానికి దిగిందని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితి వస్తే మా పార్టీకి కావలసినంత బలం బలగం ఉందని, కానీ మా పద్ధతి అది కాదని, పార్టీగా బీజేపీని గౌరవిస్తున్నామని అన్నారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఎండగట్టాలన్నారు. మా ఓపికకి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ముందుకు పోతున్నామని గుర్తుచేశారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు.

సీఎం జగన్‌కు ఆర్మీ జవాన్ రిక్వెస్ట్…. ఇంటిని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు…

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం