నీరు విడుదల చేయండి: కుమారస్వామికి కేసీఆర్ ఫోన్
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. జూరాల ప్రాజెక్ట్కు 3టీఎంసీల నీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా కుమారస్వామిని కేసీఆర్ కోరగా.. దీనికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎం.. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు తాగునీటి కోసం జూరాలకు నీరు విడుదల చేయాలంటూ ఇప్పటికే తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి కూడా కర్ణాటక సీఎస్కు లేఖ రాశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. జూరాల ప్రాజెక్ట్కు 3టీఎంసీల నీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా కుమారస్వామిని కేసీఆర్ కోరగా.. దీనికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎం.. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు తాగునీటి కోసం జూరాలకు నీరు విడుదల చేయాలంటూ ఇప్పటికే తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి కూడా కర్ణాటక సీఎస్కు లేఖ రాశారు.