AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 రోజుల్లోనే జనసేన నుంచి వైసీపీలోకి!

విజయవాడ: గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు జనసేనలో చేరి ఐదు రోజులు మాత్రమే అయ్యింది. పార్టీ తరుపున పోటీ చేసేందుకు టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో తన ఆలోచన మార్చుకున్నారు. జనసేనకు బాయ్ బాయ్ చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. జనసేన తరుపున టికెట్ దక్కనప్పటికీ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జనసేన నాయకులు చెప్పినప్పటికీ మల్లికార్జునరావు సంతృప్తి చెందలేదట. జనసేన నుంచి దేవినేనికి టికెట్ లభిస్తుందని తొలుత భావించినా, […]

5 రోజుల్లోనే జనసేన నుంచి వైసీపీలోకి!
Vijay K
|

Updated on: Mar 21, 2019 | 12:11 PM

Share

విజయవాడ: గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు జనసేనలో చేరి ఐదు రోజులు మాత్రమే అయ్యింది. పార్టీ తరుపున పోటీ చేసేందుకు టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో తన ఆలోచన మార్చుకున్నారు. జనసేనకు బాయ్ బాయ్ చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. జనసేన తరుపున టికెట్ దక్కనప్పటికీ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జనసేన నాయకులు చెప్పినప్పటికీ మల్లికార్జునరావు సంతృప్తి చెందలేదట.

జనసేన నుంచి దేవినేనికి టికెట్ లభిస్తుందని తొలుత భావించినా, పవన్ మాత్రం కమతం సాంబశివరావువైపు మొగ్గు చూపారు. మూడో జాబితాలో కమతం సాంబశివరావు పేరును వెల్లడించడం జరిగింది. దీంతో మల్లికార్జున వర్గం తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు మల్లికార్జునరావు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది.