ప్రచార సమయంలో చిరు వ్యాపారిని కాపాడిన అవినాష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. గత మూడు పర్యాయాలు కొడాలి నాని ఇక్కడి నుంచి గెలుపొందారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించారు. ఈసారి దేవినేని అవినాష్కు టీడీపీ టికెట్ కేటాయించింది. దీంతో లోకల్ అభ్యర్థి నాని, నాన్ లోకల్ అభ్యర్థి అవినాష్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. గురువారం దేవినేని అవినాష్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బుడమేరు సమీపంలో.. జామకాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారి […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. గత మూడు పర్యాయాలు కొడాలి నాని ఇక్కడి నుంచి గెలుపొందారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించారు. ఈసారి దేవినేని అవినాష్కు టీడీపీ టికెట్ కేటాయించింది. దీంతో లోకల్ అభ్యర్థి నాని, నాన్ లోకల్ అభ్యర్థి అవినాష్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
గురువారం దేవినేని అవినాష్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బుడమేరు సమీపంలో.. జామకాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారి యాక్సిడెంట్లో గాయపడ్డాడు. వెంటనే స్పందించిన అవినాష్.. తన అనుచరులతో కలిసి ఆ వ్యాపారిని హాస్పిటల్కు తరలించారు. ఖర్చుల నిమిత్తం కొంత డబ్బును కూడా ఆయనకు అందజేశారు. అవినాష్ స్పందన బాగుందని స్థానికులు అంటున్నారు.
ఈ విషయాన్ని ట్వీట్ చేసిన టీడీపీ.. జగన్పై చురకలు అంటించింది. ‘ప్రచారంలో భవనం స్లాబు కూలి ఇద్దరు మృతి చెందినా, ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించే వాళ్లను చూస్తున్న ఈరోజుల్లో, ప్రజాసేవే ముందు…ప్రచారం తరువాత అనే సందేశం ఇచ్చి” ప్రజలకోసం నాయకుడు” అనిపించుకున్నారు అవినాష్.