AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిరాయింపులకు బాండ్ పేపర్‌తో చెక్

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ… పరిషత్‌ ఎన్నికల తర్వాత మళ్లీ ఆ తలనొప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల తర్వాత గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించకుండా అఫిడవిట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ ఫామ్‌ ఇచ్చే సమయంలోనే.. గెలిచిన తర్వాత పార్టీ మారబోనని రూ.20 బాండ్‌ పేపర్‌పై ప్రమాణ పత్రాన్ని అభ్యర్థుల నుంచి తీసుకోనున్నారు. అఫిడవిట్‌లో చేర్చాల్సిన నిబంధనలపై పలువురు న్యాయ నిపుణులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ […]

ఫిరాయింపులకు బాండ్ పేపర్‌తో చెక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 5:38 PM

Share

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ… పరిషత్‌ ఎన్నికల తర్వాత మళ్లీ ఆ తలనొప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల తర్వాత గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించకుండా అఫిడవిట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ ఫామ్‌ ఇచ్చే సమయంలోనే.. గెలిచిన తర్వాత పార్టీ మారబోనని రూ.20 బాండ్‌ పేపర్‌పై ప్రమాణ పత్రాన్ని అభ్యర్థుల నుంచి తీసుకోనున్నారు.

అఫిడవిట్‌లో చేర్చాల్సిన నిబంధనలపై పలువురు న్యాయ నిపుణులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విస్తృతంగా చర్చించారు. అఫిడవిట్‌ ద్వారా అటు న్యాయపరంగా, ఇటు నైతికంగా అభ్యర్థులు బాధ్యులయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులకు బీఫామ్‌ ఇచ్చే సమయంలోనే తప్పనిసరిగా అఫిడవిట్‌ తీసుకోవాలని గాంధీభవన్‌లో ఆదివారం డీసీసీలతో నిర్వహించిన సమయంలో ఉత్తమ్‌ నిర్దేశించారు. అఫిడవిట్‌ కాపీని డీసీసీలు టీపీసీసీ నాయకత్వానికి పంపిస్తారు.