AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలే: జగన్

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలేనని, ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలకు మోసపోవద్దని అన్నారు. జగనన్న పాలన వస్తుంది, మే నెలలో ప్రతి రైతుకూ రూ. 12,500 వస్తాయి, పంటల గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఉంటుందని అందరికీ చెప్పాలని ప్రజలతో జగన్ అన్నారు. ఎన్నికలే రాకపోయింటే, జగనన్న రెండు వేలు ఇస్తానని చెప్పకపోయింటే చంద్రబాబు పింఛన్‌ను రెండువేలకు […]

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలే: జగన్
Vijay K
|

Updated on: Mar 29, 2019 | 7:49 PM

Share

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలేనని, ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలకు మోసపోవద్దని అన్నారు. జగనన్న పాలన వస్తుంది, మే నెలలో ప్రతి రైతుకూ రూ. 12,500 వస్తాయి, పంటల గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఉంటుందని అందరికీ చెప్పాలని ప్రజలతో జగన్ అన్నారు. ఎన్నికలే రాకపోయింటే, జగనన్న రెండు వేలు ఇస్తానని చెప్పకపోయింటే చంద్రబాబు పింఛన్‌ను రెండువేలకు పెంచేవాడా? అని జగన్ ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌ను మూడు వేలు చేస్తాం. నిరుపేదకు ఇల్లు రావాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి, అది జగనన్నకే సాధ్యమని అందరికీ చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతొక్కరికీ తెలపాలని, విశ్వసనీయతతో కూడిన పాలన కోరుకోవాలని జగన్ అన్నారు.