- Telugu News పొలిటికల్ ఫొటోలు Atal Bihari Vajpayee Death Anniversary: PM Modi, President Kovind and others pay tributes to former prime minister
Atal Bihari Vajpayee: వాజ్పేయీ తృతీయ వర్ధంతి.. ప్రధాని మోడీ సహా ప్రముఖుల నివాళులు.. చిత్రాలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ సహా పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
Updated on: Aug 16, 2021 | 10:42 AM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న వీరు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మహానేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు ఢిల్లీలోని వాజ్పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు.

దివంగత నేత మాజీ భారత ప్రధాని అటల్బిహారీ వాజ్పేయీ తృతీయ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్నివాళులర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు.

దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ తృతీయ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు నివాళ్లులర్పించారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ తృతీయ వర్ధంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళ్లులర్పించారు.

సదైవ్ అటల్కు చేరుకొని వాజ్పేయీకి నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోఢీ. మాజీ ప్రధానమంత్రిగా దేశానికి అటజీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.




