AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taiwan train crash : సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు.. డ్రైవర్‌ సహా 51కి చేరిన మృతులు, 146 మందికి తీవ్ర గాయాలు

Taiwan train crash kills తైవాన్‌లో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఘోర రైలు ప్రమాదం సంభవించింది..

Venkata Narayana
|

Updated on: Apr 02, 2021 | 8:14 PM

Share
 తైవాన్‌లో ఒక సొరంగం లోపల ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తాజా సమాచారం ప్రకారం 51కి చేరింది.

తైవాన్‌లో ఒక సొరంగం లోపల ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తాజా సమాచారం ప్రకారం 51కి చేరింది.

1 / 5
మరో 146 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.  అంతేకాదు,  ఇంకా 200 మంది వరకూ రైలులో చిక్కుకునిపోయి ఉంటారని అంచానా వేస్తున్నారు.  ప్రమాదానికి గురైన ఈ రైలులో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు.

మరో 146 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అంతేకాదు, ఇంకా 200 మంది వరకూ రైలులో చిక్కుకునిపోయి ఉంటారని అంచానా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన ఈ రైలులో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు.

2 / 5
సొరంగ ప్రవేశం దగ్గర పట్టాల మీద జారిపడిన ఒక నిర్మాణ రంగ వాహనాన్నిఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉన్నాయి.

సొరంగ ప్రవేశం దగ్గర పట్టాల మీద జారిపడిన ఒక నిర్మాణ రంగ వాహనాన్నిఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉన్నాయి.

3 / 5
తైవాన్ రాజధాని తైపై నుంచి తైతుంగ్ కి ప్రయాణిస్తున్న ఈ రైలులో వారాంతం సెలవుల కోసం ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఉన్నారు. రైలు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది ప్రయాణీకులు రైలులో నిలబడే ఉన్నారు.

తైవాన్ రాజధాని తైపై నుంచి తైతుంగ్ కి ప్రయాణిస్తున్న ఈ రైలులో వారాంతం సెలవుల కోసం ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఉన్నారు. రైలు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది ప్రయాణీకులు రైలులో నిలబడే ఉన్నారు.

4 / 5
రైలు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడగలిగారు. రైలు ముందు భాగంలో ఉన్న 4 బోగీల నుంచి దాదాపు 100 మందిని రక్షించారు. ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం పొద్దున 9 గంటలకు జరిగింది. తైవాన్‌లో 2018 లో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 18 మంది మరణించారు. 1991లో రెండు రైళ్లు ఢీకొని 30 మంది ప్రయాణికులు మరణించగా, 112 మంది గాయపడ్డారు.

రైలు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడగలిగారు. రైలు ముందు భాగంలో ఉన్న 4 బోగీల నుంచి దాదాపు 100 మందిని రక్షించారు. ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం పొద్దున 9 గంటలకు జరిగింది. తైవాన్‌లో 2018 లో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 18 మంది మరణించారు. 1991లో రెండు రైళ్లు ఢీకొని 30 మంది ప్రయాణికులు మరణించగా, 112 మంది గాయపడ్డారు.

5 / 5