AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చినజీయర్‌ స్వామి, మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ తోడ్పాటు అభినందనీయం: పీయూష్‌ గోయెల్‌

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామీజీ కృషిని , మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు..

Subhash Goud
|

Updated on: Jun 30, 2024 | 8:20 PM

Share
ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామీజీ కృషిని , మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు.

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామీజీ కృషిని , మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు.

1 / 5
కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ శంషాబాద్‌లో ఉన్న ముచ్చింతల్‌ శ్రీరామనగరాన్ని సందర్శించారు. సమతా మూర్తిని ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శ్రీశీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామీ ఆశీస్సులు తీసుకున్నారు.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ శంషాబాద్‌లో ఉన్న ముచ్చింతల్‌ శ్రీరామనగరాన్ని సందర్శించారు. సమతా మూర్తిని ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శ్రీశీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామీ ఆశీస్సులు తీసుకున్నారు.

2 / 5
భారతీయతకు , అధ్యాత్మికతకు ఈ క్షేత్రం అద్దం పడుతుందన్నారు. ఈ క్షేత్రాన్ని ప్రధాని మోదీ కూడా దర్శించిన విషయాన్ని గుర్తు చేశారు పీయూష్‌ గోయెల్‌

భారతీయతకు , అధ్యాత్మికతకు ఈ క్షేత్రం అద్దం పడుతుందన్నారు. ఈ క్షేత్రాన్ని ప్రధాని మోదీ కూడా దర్శించిన విషయాన్ని గుర్తు చేశారు పీయూష్‌ గోయెల్‌

3 / 5
స్వామీజీ ఎంతో శ్రమతో ఈ అధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావుకు నా శుభాకాంక్షలు. టీవీ9 సంస్థ ఈ క్షేత్రాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించింది. రామానుజ స్వామీజీ సిద్దాంతాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని మంత్రి అన్నారు.

స్వామీజీ ఎంతో శ్రమతో ఈ అధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావుకు నా శుభాకాంక్షలు. టీవీ9 సంస్థ ఈ క్షేత్రాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించింది. రామానుజ స్వామీజీ సిద్దాంతాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని మంత్రి అన్నారు.

4 / 5
స్వామీజీ ఆశీస్సులతో భారత్‌ను 2047 నాటికి  అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్న నమ్మకం ఉంది. వికసిత్‌ భారత్ , ఆత్మ నిర్భర్‌ భారత్‌ , సంవృద్ధి భారత్‌గా దేశం మారుతుందని మంత్రి పేర్కొన్నారు. అధ్యాత్మిక క్షేత్రాల పరిరక్షణకు మైహోమ్‌ సంస్థ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు చేస్తున్న కృషిని పీయూష్‌ గోయెల్‌ కొనియాడారు.

స్వామీజీ ఆశీస్సులతో భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్న నమ్మకం ఉంది. వికసిత్‌ భారత్ , ఆత్మ నిర్భర్‌ భారత్‌ , సంవృద్ధి భారత్‌గా దేశం మారుతుందని మంత్రి పేర్కొన్నారు. అధ్యాత్మిక క్షేత్రాల పరిరక్షణకు మైహోమ్‌ సంస్థ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు చేస్తున్న కృషిని పీయూష్‌ గోయెల్‌ కొనియాడారు.

5 / 5
Follow Us