OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమాలు.. రూ. వెయ్యి కోట్లకు హక్కులు.?
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ మూవీస్ రచ్చ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ పుష్ప, సలార్తో పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇక ఓటీటీలోనూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది. తెలుగు సినిమాల హక్కులను కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 5 సినిమాల ఓటీటీ హక్కుల విలువ ఏకంగా రూ. 1000 కోట్లు దాటేస్తోంది..
Updated on: Jun 10, 2024 | 11:49 AM

ప్రస్తుతం అందరి దృష్టి కల్కి సినిమాపై పడింది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు, తమిళంతోపాట పలు భాషలకు సంబంధించి ఏకంగా రూ. 375 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఏకంగా రూ. 200 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 155 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ సుమారు రూ. 105 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఓజీ' మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా మారుతోన్న వేళ.. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో అందరి దృష్టి పడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 90 కోట్లకు దక్కించుకోనున్నట్లు సమాచారం.

ఇక టాలీవుడ్తో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మరో చిత్రం పుష్ప2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ. 250 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.



















