AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..

మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. క్షణికావేశం.. కట్టుకున్న వ్యక్తినే కాలయముడి దగ్గరకు పంపిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఒక భార్య.. తన భర్తను దారుణంగా చంపేసింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..
Wife Kills Husband Over Tv Volume Dispute
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 10:10 AM

Share

క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నపాటి మాటకు పంతానికి పోయి, కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. టీవీ వాల్యూమ్ విషయంలో మొదలైన చిన్న గొడవ.. ఒకరిని స్మశానానికి, మరొకరిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో కలకలం రేపింది. మంగళగిరికి చెందిన క్రాంతికి గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమె మొదటి భర్త నేర ప్రవృత్తి కారణంగా జైలు పాలు కావడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీ మెకానిక్‌గా పనిచేసే అహ్మద్‌తో క్రాంతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, సహజీవనం వరకు వెళ్లింది. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఉపవాసం వేళ.. ఊహించని విషాదం

ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో అహ్మద్ భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నాడు. నిన్న మధ్యాహ్నం పని ముగించుకుని నీరసంగా ఇంటికి వచ్చిన అహ్మద్‌కు, ఇంట్లో టీవీ సౌండ్ భారీగా వినిపించింది. ఉపవాసంలో ఉన్న తనకు ఆ శబ్దం ఇబ్బందిగా అనిపించడంతో టీవీ వాల్యూమ్ తగ్గించాలని క్రాంతిని కోరాడు. కానీ ఈ చిన్న విషయంపై క్రాంతి అహ్మద్‌తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన క్రాంతి.. వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి అహ్మద్ పొట్టలో బలంగా పొడిచింది.

తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అహ్మద్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అహ్మద్‌ లివర్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ అహ్మద్ కన్నుమూశాడు. కన్నకొడుకును కోల్పోయిన అహ్మద్ తల్లి రోదనలు మిన్నంటాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నపాటి కారణాలకే ప్రాణాలు తీసే స్థాయికి సమాజం వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే, ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడేది కాదు.

Follow Us
ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని..
ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ
మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఇవాల్టీ లేెటెస్ట్ రేట్లు ఇవిగో
మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఇవాల్టీ లేెటెస్ట్ రేట్లు ఇవిగో
ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ..
ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ..
దుమ్మురేపిన టాక్సిక్ టీజర్..
దుమ్మురేపిన టాక్సిక్ టీజర్..
త్రాచు పాముల కంటే డేంజర్.. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది
త్రాచు పాముల కంటే డేంజర్.. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది
ఆధార్-పాన్ లింక్ అవ్వడం లేదా..? ఈ సింపుల్ పని చేయండి
ఆధార్-పాన్ లింక్ అవ్వడం లేదా..? ఈ సింపుల్ పని చేయండి
ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల సినమా.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల సినమా.. ఎక్కడ చూడొచ్చంటే?
రాత్రి మిగిలిన సద్దన్నం పడేస్తున్నారా.. ?
రాత్రి మిగిలిన సద్దన్నం పడేస్తున్నారా.. ?
శివాలయంలో లింగంపై మూడు సార్లు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
శివాలయంలో లింగంపై మూడు సార్లు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?