వాస్తు టిప్స్ : ఈ వస్తువుల చేతికి ఇచ్చారా.. పేదవారు కావడం ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది జీవితంలోని చాలా విషయాల గురించి తెలుపుతుంది. అయితే ఎవరైనా సరే వాస్తు నియమాలను పాటిస్తే ఆ ఇంట అష్టఐశ్వర్యాలు ఉంటాయంట. నియమాలు పాటించని వారు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదంట. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా ఈ వస్తువులను చేతికి ఇచ్చారే పేదవారు అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు. కాగా, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 09, 2025 | 1:44 PM

పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు మన చేతులతో ఇవ్వకూడదు అని చెబుతుంది వాస్తు శాస్త్రం. దీని వలన మీ అదృష్టం వేరొకరికి వెళ్లడమే కాకుండా, మీ జీవితం మొత్తం పేదరికం, కష్టాలు, నష్టాలతో గడిచిపోతుంది. అందుకే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఎప్పుడూ కూడా ఇతరులకు మీ చేతులతో ఉప్పు ఇవ్వకూడదంట. అంతే కాకుండా ఎవరి చేత ఉప్పు తీసుకోకూడదంట. ఉప్పు తీసుకోవడం వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయంట. శాశ్వతంగా అప్పుల ఊబిలో చిక్కుకపోతారంట. ఒక వేళ ఉప్పు ఇచ్చినట్లు అయితే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదంట.

వాస్తు శాస్త్రం ప్రకారం మన చేతులతో ఎప్పుడూ ఎవ్వరికీ ఎర్ర మిరపకాయలు ఇవ్వకూడదంట.దీని వలన ఇద్దరి మధ్య సంబంధం చెడిపోవడమే కాకుండా, ఇద్దరి మధ్య మనస్పర్థలు అనేవి అధికంగా వస్తాయంట. ఇద్దరూ దూరం అవుతారంట.

అదే విధంగా మీరు వాస్తు శాస్త్రాన్ని నమ్మినట్లు అయితే , వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు, ఆవాలు వేరొకరికి అస్సలే ఇవ్వకూడదంట. దీని వలన మీ ఇంటి లక్ష్మీదేవి వేరొకరికి ఇస్తున్నట్లేనంట. అంతే కాకుండా ఇచ్చేవారు డబ్బు సమస్యలు ఎదుర్కొంటారంట.

కొంత మంది దాహం వేస్తుందని వచ్చిన వ్యక్తికి ఒక పాత్రలో నీరు ఇవ్వడానికి బదులు కొన్ని సార్లు చేతిలో పోస్తారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇలా చేయడం వలన అప్పుల సమస్యలు ఎదుర్కోక తప్పదంట. అందుకే ఈ విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలంట.



