- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new smart TV xiaomi pro QLED features and price details
xiaomi pro QLED: కొత్త టీవీని లాంచ్ చేస్తున్న షావోమీ.. క్యూఎల్ఈడీ స్క్రీన్తో..
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ ఓవైపు ఫోన్లతో పాటు మరోవైపు స్మార్ట్ టీవీలను సైతం తీసుకొస్తోంది. ఇంఉలో భాగంగానే తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చే పనిలో పడింది. షావోమీ ప్రో క్యూఎల్ఈడీ పేరుతో ఈ టీవీని తీసుకొస్తున్నారు. ఈ టీవీలో ఎలాంటి పీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 26, 2024 | 1:08 PM

చైనాకు చెందిన షావోమీ భారత మార్కెట్లోకి కొత్త టీవీని తీసుకొస్తోంది. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ పేరుతో ఈ టీవీని తీసుకొస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన ఈ టీవీ లాంచ్ కానుంది. ఇందులో భాగంగా 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్తో టీవీలను తీసుకొస్తున్నారు.

షావోమీ టీవీలో మ్యాజిక అనే ఫీచర్ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా యూజర్లకు వైబ్రంట్ కలర్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ టీవీ స్క్రీన్ ఫినిషింగ్లు మెటల్లో డిజైన్ చేశారు.

ఈ టీవీల్లో సినిమాటిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ అందించేలా స్పీకర్లను అందించనున్నారు. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలను అందించనున్నారు. ఈ టీవీలో 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉండనుంది.

ఎమ్ఐ.కామ్తో పాటు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్లో ఈ టీవీ అందుబాటులోకి రానుంది. కాగా ధరకు సంంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆగస్టు 27వ తేదీన దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

ఇదిలా ఉంటే.. షావోమీ గతేడాది షావోమీ.. ఎక్స్ ప్రో పేరుతో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా 40 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ వేరియంట్స్లో తీసుకొచ్చారు.





























