- Telugu News Photo Gallery Technology photos Samsung launching new smart phones Galaxy A25 5G, Galaxy A15 5G smartphones in india check here for full details
Samsung: బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసిన సామ్సంగ్.. రెండు కొత్త ఫోన్లు..
ఇటీవలి కాలంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వచ్చిన సామ్సంగ్.. తాజాగా బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే రెండు కొత్త మోడల్స్ను లాంచ్ చేస్తోంది. గ్యాలక్సీ ఏ25, గ్యాలక్సీ ఏ 15 పేరుతో ఇండియన్ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 01, 2024 | 6:27 PM

దక్షిణకొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్స్ను లాంచ్ చేస్తోంది. గ్యాలక్సీ ఏ25, గ్యాలక్సీ ఏ15 పేరుతో రెండు ఫోన్ను తీసుకొస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేస్తాయి. డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.

ఇక ధర విషయానికొస్తే సామ్సంగ్ గ్యాలక్సీ ఏ15 ప్రారంభ వేరియంట్ ధర రూ. 21,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే సామ్సంగ్ గ్యాలక్సీ ఏ25 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 21,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్ సమయంలో అసలు ధరలను ప్రకటించనున్నారు.

గ్యాలక్సీ ఏ25 5జీ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో ఈ స్క్రీన్ను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్ మలి జీ68 ఎమ్పీ4 జీపీయూ ప్రాసెసర్తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్+8 మెగాపిక్సెల్+ 2 మెగపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.

గ్యాలక్సీ ఏ15 5జీ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే.. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ద్వారా పనిచేస్తుంది. ఇందులో కూడా 50MP+5MP+2MP కెమెరాలను అందించనున్నారు. ఈ ఫోన్స్లోనూ 13 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక 25 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందింనున్నారు.




