AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు తెలుసు ఏం చేయాలో.. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు! బుమ్రా, జయవర్దనే మధ్య గొడవ?

శుక్రవారం జరిగిన IPL ఎలిమినేటర్ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై 228 పరుగులు చేయగా, గుజరాత్ 208 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (81), సాయి సుదర్శన్ (80) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై తదుపరి రౌండ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. మ్యాచ్‌లో బుమ్రా, కోచ్ మధ్య చర్చ కూడా జరిగింది.

SN Pasha
|

Updated on: May 31, 2025 | 7:28 PM

Share
శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 20 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు జూన్ 1న అహ్మదాబాద్‌లో జరిగే రెండో క్వాలిఫయర్‌లో ముంబై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 20 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు జూన్ 1న అహ్మదాబాద్‌లో జరిగే రెండో క్వాలిఫయర్‌లో ముంబై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

1 / 5
ఎలిమినేటర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగ్గా కనిపించింది. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ముంబై చేతి నుంచి మ్యాచ్‌ చేజారిపోయినట్లు కనిపించింది. దీంతో ముంబై సాయి, సుందర్‌ భాగస్వామ్యాన్ని ఎలాగైనా బ్రేక్‌ చేయాలనుకున్నారు.

ఎలిమినేటర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగ్గా కనిపించింది. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ముంబై చేతి నుంచి మ్యాచ్‌ చేజారిపోయినట్లు కనిపించింది. దీంతో ముంబై సాయి, సుందర్‌ భాగస్వామ్యాన్ని ఎలాగైనా బ్రేక్‌ చేయాలనుకున్నారు.

2 / 5
ఈ సమయంలో బౌండరీ వద్ద ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే, జస్ప్రీత్ బుమ్రా మధ్య చర్చలు జరిగాయి. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. ఈ ఓవర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ మొదటి డెలివరీ తర్వాత, కెమెరా బౌండరీ వద్ద నిలబడి ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా వైపు వెళ్ళింది.

ఈ సమయంలో బౌండరీ వద్ద ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే, జస్ప్రీత్ బుమ్రా మధ్య చర్చలు జరిగాయి. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. ఈ ఓవర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ మొదటి డెలివరీ తర్వాత, కెమెరా బౌండరీ వద్ద నిలబడి ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా వైపు వెళ్ళింది.

3 / 5
బౌండరీ వెలుపల బుమ్రాతో హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఏదో చెబుతున్నట్లు కనిపించింది. అయితే, బుమ్రా అతనితో ఏకీభవించలేదు. దీనితో జయవర్ధనే కూడా బాధపడ్డాడు. ఇద్దరూ ఏదో విషయం గురించి వాదించుకుంటున్నారు. అయితే, ఏమిటి అనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.

బౌండరీ వెలుపల బుమ్రాతో హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఏదో చెబుతున్నట్లు కనిపించింది. అయితే, బుమ్రా అతనితో ఏకీభవించలేదు. దీనితో జయవర్ధనే కూడా బాధపడ్డాడు. ఇద్దరూ ఏదో విషయం గురించి వాదించుకుంటున్నారు. అయితే, ఏమిటి అనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.

4 / 5
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రోహిత్ శర్మ అద్భుతమైన 81, జానీ బెయిర్‌స్టో 47 పరుగులతో ముంబై 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా (22*) కూడా త్వరితగతిన తమ సహకారాన్ని అందించారు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన గుజరాత్ 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సాయి సుదర్శన్ అద్భుతమైన ఆటను ఆడి 80 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 48 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రోహిత్ శర్మ అద్భుతమైన 81, జానీ బెయిర్‌స్టో 47 పరుగులతో ముంబై 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా (22*) కూడా త్వరితగతిన తమ సహకారాన్ని అందించారు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన గుజరాత్ 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సాయి సుదర్శన్ అద్భుతమైన ఆటను ఆడి 80 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 48 పరుగులు చేశాడు.

5 / 5
Follow Us