శివుడి కన్నీరుతో ఏర్పడిన కుండ.. కృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం.. పాకిస్తాన్‌లో మహిమాన్విత ప్రదేశం

శివునికి సంబంధించిన అనేక పురాతన ఆలయాలు భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. లయకారుడిని వివిధ రూపాలతో నామాలతో భక్తులు పూజిస్తారు. అలాంటి పురాతన దేవాలయం పాకిస్థాన్‌లో కూడా ఉంది. పురాణ కథల ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞ గుండంలో పడి ప్రాయోప్రవేశం చేయడంతో శివుడు విచారంగా ఉన్నాడు. అప్పుడు శివుడి కంట నుంచి వచ్చిన కన్నీళ్లు ఒక పెద్ద చెరువుగా మారేంతగా కలత చెందాడు.

|

Updated on: Jun 21, 2024 | 3:25 PM

పాకిస్తాన్‌లోని సుమారు 5000 సంవత్సరాల పురాతన కటాసరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు. ఇది పాకిస్థాన్‌లోని చక్వాల్ జిల్లాకు దాదాపు 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ సముదాయంలో నిర్మించబడిన మరో ఏడు దేవుళ్ళ, దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని సత్గ్రహ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం.. అయితే పాండవులు వనవాసం గడిపింది కూడా ఇక్కడే.

పాకిస్తాన్‌లోని సుమారు 5000 సంవత్సరాల పురాతన కటాసరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు. ఇది పాకిస్థాన్‌లోని చక్వాల్ జిల్లాకు దాదాపు 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ సముదాయంలో నిర్మించబడిన మరో ఏడు దేవుళ్ళ, దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని సత్గ్రహ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం.. అయితే పాండవులు వనవాసం గడిపింది కూడా ఇక్కడే.

1 / 6
కటాసరాజ ఆలయం అనేక దేవాలయాలు .. స్మారక చిహ్నాలతో కూడిన భారీ సముదాయం. ప్రధాన ఆలయం శివునికి అంకితం చేయబడింది. గర్భాలయంలో శివలింగం ఉంది. ఈ సముదాయంలోని ఇతర ఆలయాలు విష్ణువు, గణేశుడు, దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి. కటాసరాజ ఆలయం ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు

కటాసరాజ ఆలయం అనేక దేవాలయాలు .. స్మారక చిహ్నాలతో కూడిన భారీ సముదాయం. ప్రధాన ఆలయం శివునికి అంకితం చేయబడింది. గర్భాలయంలో శివలింగం ఉంది. ఈ సముదాయంలోని ఇతర ఆలయాలు విష్ణువు, గణేశుడు, దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి. కటాసరాజ ఆలయం ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు

2 / 6
కటాసరాజ ఆలయం దేవాలయం ఒక పెద్ద చెరువు చుట్టూ నిర్మించబడింది. ఇది శివుని కన్నీటితో ఏర్పడిందని నమ్మకం. పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీతో ఇక్కడ నివసించాడు. దక్ష యజ్ఞంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసి మరణించడంతో శివుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అతను చాలా ఏడ్చాడు.. అలా శివుడి కంట నుంచి పడిన కన్నీళ్ల నుండి ఒక చెరువు ఏర్పడింది. శివుని కన్నీరు కారణంగా ఈ ఆలయానికి కటాస్ అని పేరు వచ్చింది.

కటాసరాజ ఆలయం దేవాలయం ఒక పెద్ద చెరువు చుట్టూ నిర్మించబడింది. ఇది శివుని కన్నీటితో ఏర్పడిందని నమ్మకం. పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీతో ఇక్కడ నివసించాడు. దక్ష యజ్ఞంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసి మరణించడంతో శివుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అతను చాలా ఏడ్చాడు.. అలా శివుడి కంట నుంచి పడిన కన్నీళ్ల నుండి ఒక చెరువు ఏర్పడింది. శివుని కన్నీరు కారణంగా ఈ ఆలయానికి కటాస్ అని పేరు వచ్చింది.

3 / 6
మహాభారత కాలంలో పాండవ సోదరులు జూదంలో సర్వం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసంలో ఇక్కడ నివసించారు. పాండవులు అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు దాహం వేయగా, వారిలో ఒకరు నీరు కోసం కటాస్ కుండం వద్దకు వచ్చారని దీనికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది.

మహాభారత కాలంలో పాండవ సోదరులు జూదంలో సర్వం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసంలో ఇక్కడ నివసించారు. పాండవులు అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు దాహం వేయగా, వారిలో ఒకరు నీరు కోసం కటాస్ కుండం వద్దకు వచ్చారని దీనికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది.

4 / 6
అప్పట్లో ఈ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది. తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే కుండంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల, సహదేవ, అర్జున, భీముడు కుండం వద్ద సృహ కోల్పోయారు.

అప్పట్లో ఈ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది. తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే కుండంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల, సహదేవ, అర్జున, భీముడు కుండం వద్ద సృహ కోల్పోయారు.

5 / 6
అప్పుడు కుండం వద్దకు వచ్చిన ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. యక్షులు యుధిష్ఠిరుడి జ్ఞానానికి ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకువచ్చి కుండంలోని నీరు త్రాగడానికి అనుమతించారు.

అప్పుడు కుండం వద్దకు వచ్చిన ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. యక్షులు యుధిష్ఠిరుడి జ్ఞానానికి ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకువచ్చి కుండంలోని నీరు త్రాగడానికి అనుమతించారు.

6 / 6
Follow us
Latest Articles